ప్రధాన మంత్రి కార్యాలయం

మిజోరమ్ లోజరిగిన వంతెన దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 23 AUG 2023 12:45PM by PIB Hyderabad

మిజోరమ్ లో జరిగిన వంతెన సంబంధి దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు ఇదే ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం X లో పోస్ట్ చేసిన ట్వీట్ లలో -

 

‘‘మిజోరమ్ లో జరిగిన వంతెన సంబంధి దుర్ఘటన గురించి తెలుసుకొని బాధ పడ్డాను. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా సంతాపం. గాయపడ్డ వారు త్వరగా పునఃస్వస్థులు అగుదురు గాక. రక్షణ సంబంధి కార్యకలాపాలు పురోగతి లో ఉన్నాయి; బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందజేయడం జరుగుతున్నది.

 

ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.

 

 



(Release ID: 1951594) Visitor Counter : 151