ప్రధాన మంత్రి కార్యాలయం
లేహ్ సమీపాన దుర్ఘటనలో సైనిక సిబ్బంది మృతిపై ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
19 AUG 2023 11:50PM by PIB Hyderabad
లేహ్ సమీపాన సంభవించిన దుర్ఘటనలో భారత సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“లేహ్ సమీపాన దుర్ఘటనలో మన సైనిక సిబ్బందిని కోల్పోవడం నన్నెంతో బాధించింది. దేశానికి వారి అసమాన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉండిపోతాయి. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను PM @narendramodi” అని ఆకాంక్షించారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1950678)
आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam