హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈరోజు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా తిరంగా యాత్రలో ప్రసంగించిన కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నిలబడిన వేలాది మందిని చూస్తుంటే దేశంలోని ప్రతి చిన్నారి మరియు యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన ప్రచారం విజయవంతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

దేశ ప్రజలు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉద్యమం దేశభక్తిని పెంపొందించే మాధ్యమంగా మారింది, అదేవిధంగా 'మేరీ మాతి, మేరీ దేశ్' కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో భారతదేశం గొప్ప, అభివృద్ధి చెందిన మరియు స్వీయ-ఆధారితంగా మారాలన్న మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది.

ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రజలు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని, సెల్ఫీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర హోంమంత్రి దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఒక త్యాగం మాత్రమే కాదు..అది మనకు మరియు రాబోయే తరాలకు దేశ ప్రయోజనాల కోసం జీవించడానికి విలువైనది

1857 నుండి 1947 వరకు 90 సంవత్సరాల కాలంలో యువ తరం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించి ద

Posted On: 13 AUG 2023 3:00PM by PIB Hyderabad

ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా తిరంగా యాత్రలో కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో అజాదిక అమృత్ మహోత్సవ్ సందర్భంగా వేలాది మంది చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నిల్చుని చూస్తుంటే ప్రతి చిన్నారిలో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారం కనిపిస్తోందని అన్నారు. దేశంలోని యువత విజయం సాధిస్తోందని చెప్పారు. 2022 ఆగస్టు 15న దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని ఒక్క ఇల్లు కూడా లేదని, ప్రజలు పెద్ద సంఖ్యలో సెల్ఫీలు తీసుకున్నారని అన్నారు. దేశ ప్రజలు తమ ఇళ్ల వద్ద మళ్లీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ నుంచి మట్టి, త్రివర్ణ పతాకాన్ని మోసుకొచ్చిన యువకులు ఢిల్లీకి చేరుకుంటారని చెప్పారు. ఈ యువత దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చిన మట్టిని, త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అందజేయనున్నారు. యువశక్తి ప్రతి గ్రామంలో గొప్ప భారతదేశం కోసం సంకల్పాన్ని కూడా వ్యాప్తి చేస్తుందని తెలిపారు.

 

image.png


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉద్యమం దేశభక్తిని పెంపొందించే మాధ్యమంగా మారిందని అదేవిధంగా 'మేరి మాతి, మేరా దేశ్' కార్యక్రమం కూడా మన సంకల్పాన్ని నెరవేరుస్తుందని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో గొప్ప, అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన కలిగిన భారతదేశాన్ని తయారు చేసేందుకు సమాయత్తమవ్వాలన్నారు. దేశప్రజలందరూ ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆన్‌లైన్‌లో సెల్ఫీలు అప్‌లోడ్ చేయాలని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల ఈ ప్రయత్నం మొత్తం దేశాన్ని గొప్పగా మార్చడానికి ఒక ప్రచారం అవుతుందని అభిప్రాయపడ్డారు. యువత తన ముందు నిలబడి ఉన్న ఉత్సాహాన్ని, ఈ ప్రచారం దేశభక్తిని ముందుకు తీసుకువెళుతుందని మరియు ప్రజలలో ముఖ్యంగా పిల్లలు మరియు యువతలో దేశాన్ని గొప్పగా మార్చాలనే సంకల్పాన్ని నింపుతుందని శ్రీ షా అన్నారు.

 

image.png


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా దేశభక్తిని పెంపొందించే పనిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. 2023 ఆగస్టు 15న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగుస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం 15 ఆగస్టు 2023 నుండి 15 ఆగస్టు 2047 వరకు స్వాతంత్య్ర అమృత్‌కాల్‌ను జరుపుకుంటుందని తెలిపారు.  స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాల పూర్తయ్యేనాటికి దేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా తీర్చిదిద్దుతామని..ముఖ్యంగా మన యువ తరానికి అమృత్ కాల్ చాలా ముఖ్యమైనదని శ్రీ షా అన్నారు. 1857 నుంచి 1947 వరకు 90 ఏళ్లలో యువ తరం స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపి దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేసిందని అదే విధంగా భారతదేశాన్ని గొప్పగా చేయడానికి 2023 నుంచి 2047 వరకు భారతమాతకు యువత అంకితం కావాలని అన్నారు.

 

image.png


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చాలా మంచి స్ఫూర్తితో దేశ ప్రజల ముందు ఉంచారని కేంద్ర హోం మరియు సహకార మంత్రి అన్నారు. 1857 నుంచి 1947 వరకు 90 ఏళ్ల కాలంలో లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు నిరంతరం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి విముక్తి కల్పించారన్నారు. ఫలితంగా గత 75 సంవత్సరాల నుండి మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఈ స్వాతంత్ర్య పోరాటంలో చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు అని శ్రీ షా అన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ మరణాన్ని సంతోషంగా అంగీకరించి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉరిశిక్షకు దిగారు. కులం, మతం, రాష్ట్రం, ప్రాంతం అనే తేడా లేకుండా దేశం కోసం జీవితాన్ని అర్పించిన 17 ఏళ్ల ఖుదీరామ్ బోస్.. మరోవైపు 80 ఏళ్ల బాబు కున్వర్ సింగ్ జీ 1857 యుద్ధంలో అమరులయ్యారు. మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం కేవలం త్యాగం మాత్రమే కాదని, ఇది మనందరికీ మరియు రాబోయే తరాలకు దేశ ఆశయం కోసం జీవించడం విలువైనదని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దేశం కోసం మనం చనిపోలేం కానీ దేశం కోసం మనం బ్రతకకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు.
 

****



(Release ID: 1948394) Visitor Counter : 160