రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav g20-india-2023

ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ అధ్యక్షునికి రాష్ట్రపతి ఆహ్వానం

Posted On: 12 JUL 2023 1:34PM by PIB Hyderabad

ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్కరీమ్ అల్-ఇస్సా ఈ రోజు (జూలై 12, 2023) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని కలిశారు.

భారతదేశంలో తన మొదటి అధికారిక పర్యటన సందర్భంగా డాక్టర్ అల్ ఇస్సాను స్వాగతించిన రాష్ట్రపతి..సహన విలువలు, నియంత్రణ మరియు మతాల మధ్య సంభాషణలను ప్రోత్సహించడంలో ముస్లిం వరల్డ్ లీగ్ పాత్ర లక్ష్యాలను భారతదేశం అభినందిస్తోందని అన్నారు. భారతదేశం..బహుళ-సాంస్కృతిక, బహు భాషా, బహుళ జాతి మరియు బహుళ మత సమాజంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుంటుందని ఆమె పేర్కొన్నారు. 20 కోట్లకుపైగా ఉన్న భారతీయ ముస్లిం సోదరులు మరియు సోదరీమణులు ప్రపంచంలోని ముస్లింలలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దారని తెలిపారు.

సౌదీ అరేబియాతో సంబంధాలకు భారత్ ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్రపతి అన్నారు.రెండు దేశాలకు వాణిజ్యం మరియు ప్రజలతో ప్రజల సంబంధాలలో పాతుకుపోయిన స్నేహపూర్వక సంబంధాల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. ప్రపంచంతో పంచుకోవడానికి మన రెండు దేశాలు విలువైన బోధనలను కలిగి ఉన్నాయని ఆమె తెలిపారు.

భారతదేశం మరియు సౌదీ అరేబియా రెండూ ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తున్నాయని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 'జీరో టాలరెన్స్' కోసం పిలుపునిస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదం మరియు హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమగ్ర విధానం అవసరమని, ఇది మితవాద ఆలోచనలతో నిమగ్నమవ్వడం ద్వారానే సాధ్యమవుతుందని ఇద్దరు నేతలు అంగీకరించారు. తీవ్రవాదం, ఉగ్రవాదం మరియు హింసకు వ్యతిరేకంగా డాక్టర్ అల్ ఇస్సా  స్టాండ్‌ను రాష్ట్రపతి ప్రశంసించారు. భారత్‌లో అతని పర్యటన ముస్లిం వరల్డ్ లీగ్ సహకారం కోసం మరిన్ని మార్గాలను అందిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.


 

***



(Release ID: 1938924) Visitor Counter : 177