బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏడో దశ వాణిజ్య బొగ్గు గనుల వేలం కోసం 35 బిడ్‌లు స్వీకరించిన భారత బొగ్గు మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 27 JUN 2023 5:05PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'నామినేటెడ్ అథారిటీ' ద్వారా ఏడో దశ వాణిజ్య బొగ్గు గనుల వేలం 29 మార్చి 2023న ప్రారంభమైంది. 103 బొగ్గు గనుల కోసం ఈ వేలం ప్రారంభించారు. బిడ్‌ సమర్పించడానికి చివరి తేదీ 27 జూన్ 2023.

ఇప్పటివరకు, 18 బొగ్గు గనుల కోసం 35 ఆఫ్‌లైన్ బిడ్‌లు వచ్చాయి. వీటిలో, ఏడు గనులకు రెండు లేదా అంతకంటే ఎక్కువ బిడ్‌లు వచ్చాయి. వేలం ప్రక్రియలో వచ్చిన ఆన్‌లైన్ బిడ్‌లను 28 జూన్ 2023న న్యూదిల్లీలో తెరుస్తారు.

 

****


(రిలీజ్ ఐడి: 1935818) సందర్శకుల సూచీ సంఖ్య : : 188
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Kannada , Urdu , हिन्दी , Marathi , Tamil