ప్రధాన మంత్రి కార్యాలయం

సౌరశక్తి సద్వినియోగంపై గోవాకు ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 17 JUN 2023 8:33PM by PIB Hyderabad

   గోవాలో సౌర ఫలకాల ఏర్పాటు దిశగా ప్రజలను ప్రోత్సహిస్తూ పౌరహిత పోర్టల్‌ ద్వారా రాయితీల పొందేందుకు శ్రీకారం చుట్టడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ దిశగా సంయుక్తంగా కృషి చేసిన గోవా ఇంధన అభివృద్ధి సంస్థ, నవ్య-పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ, విద్యుత్‌ శాఖలను ఆయన అభినందించారు. ఈ చర్యలు గోవా ప్రజల కోసం విద్యుదుత్పాదనలో పర్యావరణ హిత పద్ధతుల అనుసరణకు స్ఫూర్తినిస్తాయన్నారు.

దీనిపై గోవా ముఖ్య‌మంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

“గోవా ప్రజలు సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సంయుక్త కృషి సుస్థిర ప్రగతికి దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1933235) Visitor Counter : 130