ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగాలలోనియమించిన వ్యక్తుల కుదాదాపు గా 70,000 నియామక లేఖల నురోజ్ గార్ మేళాలో భాగం గా  జూన్ 13 వ తేదీ నాడుపంపిణీ చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 12 JUN 2023 4:00PM by PIB Hyderabad

ప్రభుత్వ విభాగాల లో మరియు సంస్థల లో క్రొత్త గా నియామకం జరిగిన సభ్యురల కు ఉద్దేశించినటువంటి సుమారు 70,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ2023 వ సంవత్సరం లో జూన్ 13 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ నియామకం జరిగిన వ్యక్తుల ను ఉద్దేశించి ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

 

రోజ్ గార్ మేళా ను దేశ వ్యాప్తం గా 43 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల తో పాటు రాష్ట్ర ప్రభుత్వాల లో/కేంద్రపాలిత ప్రాంతాల లో కూడా ను నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తం గా ఎంపిక అనంతరం క్రొత్త గా ఉద్యోగాల లో నియమితులు అయిన వారు ఆర్థిక సేవల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, పరమాణు శక్తి విభాగం, రేల్ వేస్ విభాగం, ఆడిట్ ఎండ్ అకౌంట్స్ విభాగం మరియుహోం అఫైర్స్ విభాగం తదితర వివిధ విభాగాల లో ప్రభుత్వం లో భాగం కానున్నారు.

 

ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్న ప్రధాన మంత్రి యొక్క వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో ఒక అడుగు గా రోజ్ గార్ మేళా ఉంది. రోజ్ గార్ మేళా భవిష్యత్తు లో ఉద్యోగాల కల్పన లో ఒక ఉత్ప్రేరకం వంటి భూమిక ను నిర్వర్తిస్తుందన్న ఆశ ఉంది. దీనితో పాటు, యువతీ యువకుల కు వారి యొక్క సశక్తీకరణ, ఇంకా దేశాభివృద్ధి లో పాలుపంచుకోవడం కోసం సార్థకమైన అవకాశాల ను ప్రసాదించగలదన్న భావన కూడా ఉంది.

 

క్రొత్త గా ఉద్యోగాల లో నియమితులు అయిన వారికి ఐజిఒటి కర్మయోగి (iGOTKarmayogi)పోర్టల్ లో ఆన్ లైన్ మాడ్యూల్ అయినటువంటి ‘కర్మయోగి ప్రారంభ్మాధ్యం ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశం దక్కుతుంది. ఐజిఒటి కర్మయోగి పోర్టల్ లో 400 కు పైచిలుకు ఇ-లర్నింగ్ పాఠ్యక్రమాల ను ‘ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినా’ నేర్చుకొనే ఫార్మేట్ పరం గా అందుబాటు లో ఉంచడం జరిగింది.

 

***

 



(Release ID: 1931694) Visitor Counter : 183