ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిశా లో రైలుదుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 02 JUN 2023 9:52PM by PIB Hyderabad

ఒడిశా లో రైలు దుర్ఘటన జరిగి ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఒడిశా లో జరిగిన రైలు దుర్ఘటన గురించి తెలుసుకొని బాధపడుతున్నాను. ఈ దు:ఖ ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. రైల్ వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw తో మాట్లాడి, స్థితి ఎలా ఉన్నదీ అడిగి తెలుసుకొన్నాను. దుర్ఘటన స్థలం లో బాధితుల ను ఆదుకొనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దుర్ఘటన ప్రభావితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతోంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1929615) Visitor Counter : 138