గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
అమృత్ సరోవర్ కార్యక్రమం పురోగతిని, పర్యవేక్షణను సమీక్షించిన అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్
Posted On:
17 MAY 2023 3:25PM by PIB Hyderabad
అమృత్ సరోవర్ కార్యక్రమం పురోగతిని, పర్యవేక్షణను సమీక్షించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్ అధ్యక్షత వహించారు. అదనపు కార్యదర్శి, ప్రిన్సిపల్ కార్యదర్శి, కార్యదర్శి, అన్ని రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులు, మిషన్ అమృత్ సరోవర్ రాష్ర్ట స్థాయి నోడల్ అధికారులు; వివిధ జిల్లాల నోడల్ అధికారులతో పాటు డిఎం/ డిసి/ సిఇఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్తయిన అమృత్ సరోవర్ ల సుస్థిరత దీర్ఘకాలం ఉండేలా చూసేందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరూ తుది నాణ్యత పరీక్షలు నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సూచించారు. అధీకృత అధికారులు జిల్లాలోని ఇతర బ్లాక్ లకు చెందిన వారై ఉండాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. మహాత్మాగాంధీ ఎన్ఆర్ఇజిఎస్ నిధులతో లేదా సోషల్ ఆడిట్ తప్పనిసరి అయిన పథకాల ద్వారా నిర్మించిన/ పునరుజ్జీవింపచేసిన అమృత్ సరోవర్ల పరిశీలనకు సోషల్ ఆడిట్ టీమ్ లను పంపనున్నట్టు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల టీమ్ లు ముందుగా తనిఖీ అయిన సైట్ల శాంపిల్ పరీక్ష నిర్వహిస్తారు. ఇవి కాకుండా ఎంపిక చేసిన పూర్తయిన అమృత్ సరోవర్ల తనిఖీకి జాతీయ స్థాయి పర్యవేక్షకులను (ఎన్ఎల్ఎం) నియమిస్తారు. తనిఖీల వివరాలు తెలియచేయడానికి ఒక యాప్ ను కూడా అభివృద్ధి చేశారు.
పూర్తయిన అమృత్ సరోవర్లన్నింటినీ రుతుపవనాలు రావడానికి ముందే అంటే 2023 జూన్ 10వ తేదీ నాటికి ముందే భౌతికంగా తనిఖీ చేయడానికి అన్ని రాష్ర్టాలు/ యుటిలు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాయి. తనిఖీలో ఏవైనా లోపాలను గుర్తించినట్టయితే మెరుగుదలకు తగు దిద్దుబాటు చర్యలు చేపడతారు.
మిషన్ అమృత్ సరోవర్ ను ప్రధానమంత్రి 2022 ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభించారు. ప్రతీ ఒక్క జిల్లాలోనూ కనీసం 75 అమృత్ సరోవర్లను నిర్మించడం/ పునరుజ్జీవింపచేయడం ద్వారా స్థిరమైన జలవనరులు అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం. మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలో 50,000 అమృత్ సరోవర్ల నిర్మాణ లక్ష్యం పూర్తయింది.
ప్రభుత్వంలోని అన్నిశాఖలను భాగస్వాములను చేసుకుంటూ ఈ మిషన్ అమలు పరుస్తున్నారు. 8 కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్ మెంట్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయి. అవి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భూ వనరుల మంత్రిత్వశాఖ; తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ, జలవనరుల మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ; పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ; రోడ్డు, రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ. వాటితో పాటు భాస్కరాచార్య నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో-ఇన్ఫర్మాటిక్స్ (బిఐఎస్ఏజి-ఎన్) మిషన్ టెక్నికల్ భాగస్వామిగా ఉంది. రాష్ర్టాల సొంత పథకాలతో పాటు మహాత్మాగాంధీ ఎన్ఆర్ఇజిఎస్, 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు; వాటర్ షెడ్ డెవలప్ మెంట్, హర్ ఖేత్ కో పానీ వంటి పిఎంఎస్ కెవై సబ్ స్కీమ్ ల ద్వారా రాష్ర్టాలు, జిల్లాలు కేంద్రగా మిషన్ పని చేస్తుంది. ఈ ప్రయత్నాలకు మద్దతుగా పౌరులు, ప్రభుత్వేతర వనరుల నుంచి నిధులు సమీకరించడాన్ని కూడా ఈ మిషన్ ప్రోత్సహిస్తుంది.
***
(Release ID: 1925117)