హోం మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం-2023 సందర్భంగా సిఏపిఎఫ్‌లు మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది భోజనంలో మిల్లెట్స్ (శ్రీ అన్న)ను ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.


అన్ని బలగాలతో సవివరంగా చర్చించిన తర్వాత కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా యొక్క స్పష్టమైన పిలుపు మేరకు భోజనంలో 30% మిల్లెట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోబడింది.

మిల్లెట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు దేశీయ మరియు ప్రపంచవ్యాప్త డిమాండ్‌ను సృష్టించడానికి భారత ప్రభుత్వం పిలుపు మేరకు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది.

మిల్లెట్లు ప్రోటీన్లకు మంచి మూలం. అలాగే గ్లూటెన్ రహిత, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) మరియు ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మొదలైన సూక్ష్మపోషకాలు మరియు ఫైటో-కెమికల్స్‌తో సమృద్ధిగా ఉంటాయి. తద్వారా సైనికుల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి.

సిఏపిఎఫ్ మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన విధులు మరియు ఈవెంట్‌లలో కూడా మిల్లెట్‌లు విస్తృతంగా ఉపయోగించబడతాయి. ఈ రంగంలోని ప్రసిద్ధ సంస్థల ద్వారా మిల్లెట్ ఆధారిత వంటకాలను తయారు చేయడంలో కుక్‌లకు శిక్షణను బలగాలు నిర్వహిస్తాయి.

Posted On: 03 MAY 2023 4:29PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం-2023 సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఏపిఎఫ్‌లు) మరియు నేషనల్‌ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది భోజనంలో మిల్లెట్స్ (శ్రీ అన్న)ను ప్రవేశపెట్టేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్ని బలగాలతో సవివరంగా చర్చించిన తర్వాత కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా యొక్క స్పష్టమైన పిలుపు మేరకు భోజనంలో 30% మిల్లెట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోబడింది.

మిల్లెట్  ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు దేశీయ మరియు ప్రపంచ డిమాండ్‌ను సృష్టించడానికి భారత ప్రభుత్వం పిలుపు మేరకు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. శ్రీ అన్నను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారం దేశంలోని కోట్లాది ప్రజల పోషకాహార అవసరాలను తీరుస్తుంది.

మినుములు ఆరోగ్యానికి మంచివి మరియు రైతులకు మరియు పర్యావరణ అనుకూలమైనవి. మిల్లెట్లు శక్తి సాంద్రత కలిగి ఉంటాయి, కరువును తట్టుకోగలవు, తక్కువ నీటి అవసరాలు కలిగి ఉంటాయి మరియు శుష్క నేలలు, కొండ ప్రాంతాలలో సులభంగా పెంచవచ్చు మరియు తెగుళ్ళకు తక్కువ అవకాశం ఉంటుంది.

మిల్లెట్స్ యొక్క కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు - ప్రోటీన్లకు  మంచి మూలం, గ్లూటెన్ రహిత; గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ)తక్కువ; మరియు డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మొదలైన సూక్ష్మపోషకాలు మరియు ఫైటో-కెమికల్స్‌తో సమృద్ధిగా ఉంటాయి.తద్వారా సైనికుల ఆహారంలో పోషక విలువలు పెరుగుతాయి.

మిల్లెట్స్ ఆధారిత మెనూను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని బలగాలను కోరింది. బలగాలు అధిక ప్రతిస్పందనను కనబరిచాయి మరియు క్రమ పద్ధతిలో మిల్లెట్‌లను భోజనంలో ప్రవేశపెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయి. సిఏపిఎఫ్‌లు మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ వివిధ విధులు మరియు ఈవెంట్‌లలో కూడా మిల్లెట్‌లు విస్తృతంగా ఉపయోగించబడతాయి.

ప్రత్యేక కౌంటర్లు/కార్నర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్, క్యాంపస్‌లలోని కిరాణా దుకాణాలు మరియు రేషన్ దుకాణంలో కూడా మిల్లెట్‌లు అందుబాటులో ఉంచబడతాయి. ఈ రంగంలోని ప్రఖ్యాత సంస్థల ద్వారా మిల్లెట్ ఆధారిత వంటకాలను తయారు చేయడంలో కుక్‌లకు శిక్షణను బలగాలు నిర్వహిస్తాయి.

మిల్లెట్ల వినియోగంపై సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులలో అవగాహన కల్పించేందుకు డైటీషియన్లు మరియు నిపుణులైన ఏజెన్సీల సేవలను వినియోగించుకుంటారు. దీనితో పాటు 'నో యువర్ మిల్లెట్స్'పై వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలు, సెమినార్లు, వెబ్‌నార్లు, వర్క్‌షాప్‌లు మరియు సింపోజియంలు నిర్వహించబడతాయి.

అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం (ఐవైఓఎం)- 2023 ప్రపంచ ఉత్పత్తిని పెంచడానికి సమర్థవంతమైన ప్రాసెసింగ్ మరియు పంట భ్రమణాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి మరియు ఆహారంలో మిల్లెట్‌లను ప్రధాన అంశంగా ప్రోత్సహించడానికి ఇది అవకాశాన్ని అందిస్తుంది.


 

******



(Release ID: 1921852) Visitor Counter : 155