ప్రధాన మంత్రి కార్యాలయం

దేశంలోని తల్లులు.. సోదరీమణులకు ‘పీఎంఏవై’తో జీవన సౌలభ్యం: ప్రధానమంత్రి

Posted On: 14 APR 2023 9:01AM by PIB Hyderabad

   మ్ములోని పూంఛ్‌లో చంచలాదేవి అనే మహిళకు సొంత ఇల్లు సమకూర్చడం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన తెచ్చిన జీవన సౌలభ్యం గురించి ఆ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ శ్రీ జుగల్‌ కిషోర్‌ శర్మ చేసిన వరుస ట్వీట్లపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్పందించారు. దేశంలోని తల్లులు.. సోదరీమణుల జీవితాల్లో ‘పీఎంఏవై’ ఎంతో సౌలభ్యం కల్పిస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతో జమ్ముకశ్మీర్‌కు చెందిన చంచలా దేవి జీవితంలో ఆనందం వెల్లివిరిసింది. మన తల్లులు, సోదరీమణులకు ఈ పథకంతో జీవన సౌలభ్యం కలుగుతున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1916597) Visitor Counter : 118