ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి

Posted On: 08 APR 2023 6:16PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులోని ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమ వేదిక వద్దకు చేరుకోగానే వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ను ప్రధాని పరిశీలించారు. అలాగే రైలును నడిపే సిబ్బందితోపాటు బాలలో కాసేపు ముచ్చటించారు.

దీనిపై ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“ఈ వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌’తోను తమిళనాడుకు తలమానికమైన చెన్నై, కోయంబత్తూర్ నగరాల మధ్య అనుసంధానం మరింత మెరుగవుతుంది. ఈ రైలును జెండా ఊపి సాగనంపడంతోపాటు ఇక్కడి యువ మిత్రులను కూడా నేను కలుసుకున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

   ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ శ్రీ ఆర్‌.ఎన్‌.రవి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌ కూడా పాల్గొన్నారు.

 

 

***

DS/TS

 

 



(Release ID: 1915119) Visitor Counter : 134