ప్రధాన మంత్రి కార్యాలయం

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

Posted On: 08 APR 2023 6:12PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ త‌మిళ‌నాడులోని చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం కొత్త సమీకృత టెర్మిన‌ల్ భవనం (ఫేజ్-1) ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ప్రయాణికుల కోసం కల్పించిన సదుపాయాలను కూడా ఆయన పరిశీలించారు.

దీనిపై ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“చెన్నై విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ఈ గొప్ప నగర ప్రజలతోపాటు తమిళనాడు రాష్ట్రం మొత్తానికీ గర్వకారణం. ఈ భవన నిర్మాణంలో ఘనమైన తమిళనాడు  సంస్కృతి ప్రతిఫలిస్తోంది ” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

p style="text-align:justify"> 

   చెన్నై విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్‌ను రూ.1260 కోట్లతో నిర్మించారు. దీంతో విమానాశ్రయ ప్రయాణికుల వార్షిక నిర్వహణ సామర్థ్యం ఏటా 23 మిలియన్ల (ఎంపీపీఏ) నుంచి 30 మిలియన్ల స్థాయికి పెరుగుతుంది. తమిళ సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కొత్త టెర్మినల్‌ నిర్మితమైంది. ఈ మేరకు ముగ్గులు, చీరలు, దేవాలయాలు తదితర అంశాలతో ఇక్కడి సహజ పరిసరాలను ప్రతిబింబించేలా భవనం రూపొందింది.

   ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని వెంట తమిళనాడు గవర్నర్‌ శ్రీ ఆర్‌.ఎన్‌.రవి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమ శాఖ, సమాచార-ప్రసార మంత్రిత్వశాఖల సహాయ మంత్రి శ్రీ ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

***

DS/TS



(Release ID: 1915118) Visitor Counter : 138