ప్రధాన మంత్రి కార్యాలయం

‘సెయిల్‌’ 2022-23లో రికార్డుస్థాయి ఉత్పత్తి సాధించడంపై ప్రధానమంత్రి అభినందన

Posted On: 02 APR 2023 9:12AM by PIB Hyderabad

   స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఐఎల్‌-సెయిల్‌) లిమిటెడ్‌ 2022-23లో హాట్ మెటల్, ముడి ఉక్కు ఉత్పాదనలో కొత్త రికార్డు సృష్టించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు 194.09 లక్షల టన్నుల హాట్ మెటల్ (3.5 శాతం అధికం), 182.89 లక్షల టన్నుల ముడి ఉక్కు (5.3 శాతం అధికం) ఉత్పాదన ద్వారా మునుపటి రికార్డును అధిగమించింది.

దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ- భారతదేశం ప్రతి రంగంలోనూ స్వయం సమృద్ధం అవుతున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనమని అభినందించారు. ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇంతటి విజయం సాధించినందుకు ఎనలేని అభినందనలు! ‘సెయిల్‌’ సాధించిన ఈ రికార్డు స్థాయి ఉత్పాదన ఒక్క ఉక్కు రంగంలోనే కాకుండా ప్రతి రంగంలోనూ దేశం స్వావలంబన దిశగా శరవేగంతో పయనిస్తోందని స్పష్టం చేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.


****

DS



(Release ID: 1913153) Visitor Counter : 139