ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి

Posted On: 30 MAR 2023 9:45AM by PIB Hyderabad

   శ్రీ శ్యామ్‌జీ కృష్ణవర్మ వర్ధంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“శ్రీ శ్యామ్‌జీ కృష్ణవర్మ వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అంకితభావంగల జాతీయవాది, సాహసోపేత వ్యక్తిత్వంగల ఆయన భారతదేశానికి వలస పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని మొక్కవోని ధైర్యంతో ఎదిరించారు. ఆయన ఆదర్శాల స్ఫూర్తితో మనమంతా సమున్నత భారత ప్రజానీకం సౌభాగ్యం కోసం పాటుపడదాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS/AK



(Release ID: 1912219) Visitor Counter : 132