కేంద్ర మంత్రివర్గ సచివాలయం

రానున్న వేసవిలో చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సంసిద్ధతను సమీక్షించడానికి మార్చి 14, 2023న క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన సమావేశం

Posted On: 14 MAR 2023 7:07PM by PIB Hyderabad

రానున్న వేసవిలో చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సంసిద్ధతను సమీక్షించడానికి క్యాబినెట్ సెక్రటరీ  శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన సమావేశం జరిగింది.సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులు మరియు వేసవితాపానికి గురయ్యే రాష్ట్రాలు/యూటీల ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు.

భారత వాతావరణ విభాగం (ఐఎండి) 2023 మార్చి నుండి మే వరకు ఉన్న ప్రపంచ వాతావరణ పరిస్థితులు మరియు ఉష్ణోగ్రతలపై నివేదికను అందించింది. మార్చి 2023 రెండో అర్ధభాగానికి సంబంధించిన సూచన కూడా అందించబడింది.

2023 మార్చి నుండి మే వరకు దాని  ఈశాన్య, తూర్పు & మధ్య భారతదేశం మరియు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తన ఉష్ణోగ్రత అంచనాలో తెలియజేసింది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం నుండి సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్న చోట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి తెలియజేసింది.

మార్చి 2023 మిగిలిన కాలంలో చెప్పుకోదగ్గ ఉష్ణ తరంగాల సూచనలు లేవని ఐఎండి తెలియజేసింది.అయితే మార్చి చివరి వారంలో ఇండో గంగా మైదానాలు మరియు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-30సి కంటే ఎక్కువగా ఉండవచ్చు.

ప్రస్తుతం రబీ పంట పరిస్థితి సాధారణంగా ఉందని మరియు గోధుమల ఉత్పత్తి 112.18 ఎంటీగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డి/ఒ అగ్రికల్చర్ & రైతు సంక్షేమం (డిఒఏ&ఎఫ్‌డబ్ల్యూ) సెక్రటరీ తెలిపారు.గోధుమలలో టెర్మినల్ హీట్ స్ట్రెస్‌ని పర్యవేక్షించడానికి మరియు తగ్గించడానికి వ్యవసాయ కమిషనర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని డిఒఏ&ఎఫ్‌డబ్ల్యూ ఏర్పాటు చేసిందని ఆయన  తెలియజేసారు. అలాగే క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ (సిడబ్ల్యూడబ్ల్యూజీ), అంతర్-మంత్రిత్వ కమిటీ ప్రతి వారం పంట పరిస్థితిని సమీక్షిస్తుంది.

2021 జూలైలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఉష్ణోగ్రత సంబంధిత అనారోగ్యంపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఏపి-హెచ్‌ఆర్‌ఐ) హీట్ వేవ్, హీట్-సంబంధిత అనారోగ్యాలు మరియు ప్రాథమిక స్థాయి నుండి వాటి నిర్వహణ ద్వారా ఎదురయ్యే సవాళ్లను వివరిస్తుందని హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి తెలియజేశారు. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లు, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్ మరియు తాగునీటి విషయంలో ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. సమయానుకూలమైన అవగాహనకు  అవసరమైన ఐఈసి/అవగాహన మెటీరియల్ ప్రాముఖ్యతను గురించి కూడా తెలిపిన ఆయన..అది ప్రాంతీయ భాషలలోకి కూడా అనువదించబడాలన్నారు.

డైరెక్టర్ జనరల్ (అటవీ) [డిజి(ఎఫ్)] పర్యావరణం, అడవులు & వాతావరణ మార్పు శాఖ (ఎంఒఈఎఫ్&సిసి) అటవీ అగ్ని నిర్వహణ కోసం కార్యాచరణ ప్రణాళిక మరియు సంసిద్ధతను వివరించారు. వీటిలో అగ్నిమాపక రేఖలు మరియు నీటి సేకరణ నిర్మాణాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో అగ్నిమాపక యంత్రాల నియంత్రణ మరియు రాష్ట్ర అటవీ శాఖలచే నిమగ్నమై ఉన్నాయి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) వన్ అగ్ని పేరుతో ఫారెస్ట్ ఫైర్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసిందని ఇది అగ్ని ప్రమాదానికి ముందు మరియు రియల్ టైమ్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్‌లను అందిస్తుందని చెప్పారు.

ఎంహెచ్‌ఏ మరియు ఎన్‌డిఎంఏ చేసిన ప్రయత్నాలను హోం సెక్రటరీ వివరించారు. వేడి తరంగాల నివారణ మరియు నిర్వహణ కోసం కార్యాచరణ ప్రణాళిక తయారీకి 2016లో జారీ చేయబడ్డ జాతీయ మార్గదర్శకాలు 2017 & 2019లో సవరించబడ్డాయి. అన్ని స్థాయిలలో హీట్ యాక్షన్ ప్లాన్స్(హెచ్‌ఏపిలు) సిద్ధం చేసి అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించబడింది. అలాగే ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియోలో మార్చి, ఏప్రిల్ మరియు మే, 2023లో ప్రసారం చేయబడతాయి. ఎన్‌డిఎంఏ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కమ్యూనిటీ సెన్సిటైజేషన్ ప్రయత్నానికి కూడా నాయకత్వం వహిస్తుంది.

2023 మార్చి నాటికి పవర్ ప్లాంట్‌లలో అన్ని నిర్వహణ కార్యకలాపాలను పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఇంధన మంత్రిత్వశాఖ కార్యదర్శి చెప్పారు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని పంజాబ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలను కూడా ఆయన కోరారు.తాగునీరు & పారిశుద్ధ్యం, జలవనరులు, నదుల అభివృద్ధి & గంగా పునరుజ్జీవనం మరియు పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖల కార్యదర్శులు తాగునీరు, నీటిపారుదల మరియు పశుగ్రాసానికి సంబంధించి సూచించిన చర్యలను వివరించారు.

2023లో సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన విధంగా సిద్ధంగా ఉండాలని క్యాబినెట్ సెక్రటరీ పేర్కొన్నారు. సరైన సంసిద్ధత స్థాయిలను నిర్ధారించడానికి మరియు సకాలంలో ఉపశమన చర్యలను అమలు చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వేడిగాలులు వీచే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల కార్యదర్శులు మరియు జిల్లా కలెక్టర్‌లతో సంసిద్ధతను సమీక్షించాలని ఆయన ముఖ్య కార్యదర్శులను అభ్యర్థించారు.ఎంఒహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ మరియు ఎన్‌డిఎంఏ ద్వారా జారీ చేయబడిన సలహాలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడతాయి మరియు విస్తృతంగా ప్రచారం చేయబడతాయి. హ్యాండ్ పంపుల మరమ్మతులు, ఫైర్ ఆడిట్ మరియు మాక్ డ్రిల్స్ వంటి ప్రాథమిక సన్నాహాల ప్రాముఖ్యతను క్యాబినెట్ సెక్రటరీ నొక్కి చెప్పారు. కేంద్ర ఏజెన్సీలు తమతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటూ ఉంటాయని అవసరమైన సహాయం కోసం అందుబాటులో ఉంటాయని కేబినెట్ సెక్రటరీ రాష్ట్రాలకు హామీ ఇచ్చారు.


 

*****



(Release ID: 1907020) Visitor Counter : 156