ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అయ్య వైకుంఠ స్వామివారి జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళి

Posted On: 12 MAR 2023 2:31PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర  మోదీ ఇవాళ శ్రీ అయ్య వైకుంఠ స్వామివారి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌నకు నివాళి అర్పించారు.

ఈ మేరకు  ఒక ట్వీట్‌ ద్వారా  ఇచ్చిన సందేశంలో:

“శ్రీ అయ్య వైకుంఠ స్వామివారి జయంతి నేపథ్యంలో ఆయనకు నా శ్రద్ధాంజలి. పరోపకారమే పరమావధిగా ప్రజానీకానికి సేవచేస్తూ సార్వజనీన, సమతుల సమాజ నిర్మాణానికి ఆయన అంకితమయ్యారు. అణగారినవర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన ప్రబోధాలు తరతరాలకూ  స్పూర్తిదాయకాలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1906121) Visitor Counter : 139