యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

జాతీయ యువజన ఉత్సవాలను పంజాబ్ లోని రోపర్ ఐఐటీ నుంచి ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

ప్రపంచంలో అతిపెద్ద యువశక్తి కలిగి ఉన్న భారతదేశం యువతశక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.. శ్రీ ఠాకూర్

దేశంలో 12 ప్రాంతాల్లో ప్రారంభమైన యువజన ఉత్సవాలు
మొదటి దశలో దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో యువశక్తిని ప్రతిబించేలా యువజన ఉత్సవాలు నిర్వహణ

Posted On: 04 MAR 2023 1:28PM by PIB Hyderabad

యువ ఉత్సవ్- ఇండియా @ 2047 జాతీయ యువజన ఉత్సవాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు ప్రారంభించారు. పంజాబ్ లోని రోపర్ ఐఐటీ నుంచి ప్రారంభించిన శ్రీ ఠాకూర్ యువ ఉత్సవ్ డాష్ బోర్డు కూడా ప్రారంభించారు.  

యువ ఉత్సవ ఏకకాలంలో ప్రతాప్‌గఢ్ (యు.పి.), హరిద్వార్ (ఉత్తరాఖండ్), ధార్ , హోసంగాబాద్ (ఎం.పి.), హనుమాన్‌గఢ్ (రాజస్థాన్), సరైకేలా (జార్ఖండ్), కపుర్తలా (పంజాబ్), జల్గావ్ (మహారాష్ట్ర), విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్). కరీంనగర్ (తెలంగాణ), పాలఖడ్ (కేరళ), కడలూరు (తమిళనాడు)లో ప్రారంభమైంది. . మొదటి దశలో 31 మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా 150 జిల్లాల్లో యువశక్తిని పురస్కరించుకుని యువ ఉత్సవాలు నిర్వహించనున్నారు. 

 

ప్రారంభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ ఠాకూర్ దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశానికి సేవ చేసి యువత స్వాతంత్ర్య సమరయోధులు గర్వించేలా చేయాలని కోరారు. " ప్రపంచంలోనే అతిపెద్ద యువ-శక్తి భారతదేశంలో ఉంది. యువతలో దాగి ఉన్న శక్తి, సామర్థ్యాన్ని వెలికి తీయాలి ." అని శ్రీ ఠాకూర్ అన్నారు.' విద్యార్థులు తమ హృదయానికి దగ్గరగా ఉండే ఒక సామాజిక అంశాన్ని ఎంచుకుని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి కృషి చేయాలి' అని సూచించిన శ్రీ ఠాకూర్ "యువత రేపటి దేశ నిర్మాతలు" అని అన్నారు.

 

చిరుధాన్యాల ప్రాముఖ్యత, ప్రాధాన్యతను శ్రీ ఠాకూర్ వివరించారు. 'చిరుధాన్యాల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. నీటి వినియోగం తగ్గుతుంది. భూసారాన్ని రక్షించడానికి వీలవుతుంది.' అని శ్రీ ఠాకూర్ అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని శ్రీ ఠాకూర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించిన సభికులు "ఫిట్‌నెస్ కా డోజే, ఆదా ఘంటా రోజ్ "అంటూ ప్రతిస్పందించారు. 

 “నేడు పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు ( స్టార్టప్) కలిగి ఉన్న దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. దేశంలో 107 యునికార్న్స్ పనిచేస్తున్నాయి. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు ఏర్పాటు అవుతున్న దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. ఒక్కప్పుడు బలహీన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం నేడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 5వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది. స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషి, అమలు చేసిన కార్యక్రమాల వల్ల ఇదంతా సాధ్యమైంది’’ అని శ్రీ ఠాకూర్ అన్నారు. 

 వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రి సందర్శించారు. 

నేపథ్యం:

మొదటి దశ యువ ఉత్సవ్ కార్యక్రమాలను ఆయా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తాయి. కార్యక్రమాల్లో ఎన్ వై కె ఎస్ అనుబండి క్లబ్బులు, యూత్ క్లబ్ సభ్యులతో పాటు వాలంటీర్లు, పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు, సమీప ప్రాంతాలకు చెందిన విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొంటారు.  

యువజన వ్యవహారాలు,క్రీడల మంత్రిత్వ శాఖ తన ప్రధాన యువజన సంస్థ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) ద్వారా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో "యువ ఉత్సవ్ -ఇండియా @2047" కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే యువ ఉత్సవ్ కార్యక్రమాలు మూడు దశల్లో జరుగుతాయి. దీనిలో భాగంగా మొదటి దశలో 2023 మార్చి నుంచి జూన్ వరకు జిల్లా స్థాయిలో ఒక రోజు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023 మార్చి 4 నుంచి 31 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి యువ ఉత్సవ్‌లో పాల్గొంటారు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో 2023 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు 2 రోజుల పాటు జరుగుతాయి. అన్ని రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన విజేతలు 2023 అక్టోబర్ 3/4 వ వారంలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువ ఉత్సవ్‌లో పాల్గొంటారు.

మూడు స్థాయిలలో యువ కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు, వక్తలు పోటీ పడతారు. సాంప్రదాయ కళాకారులు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఇస్తారు. 5 లక్ష్యాలు సాధించేలా ఈ ఏడాది యువ ఉత్సవ్ కార్యక్రమాలు జరుగుతాయి.

 1. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం

 2. బానిసత్వం లేదా వలసవాద మనస్తత్వం నిర్మూలన 

 3. మన వారసత్వం చూడండి. వారసత్వం చూసి గర్వించండి

 4. ఐక్యత,సంఘీభావం

 5. పౌరులలో కర్తవ్య భావం కలిగించడం 

కార్యక్రమంలో పాల్గొనే వారు 5 లక్ష్యాలను అమృత కాలంలో సాధించడానికి అనుసరించాల్సిన ప్రణాళికపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఇండియా @ 2047 సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో యువతను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా యువ ఉత్సవ్ కార్యక్రమాలు జరగనున్నాయి.  

 

****



(Release ID: 1904200) Visitor Counter : 234