సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

25 వ్యసన విముక్తి చికిత్స కేంద్రాలను (ఏటీఎఫ్‌లు) 9 ఫిబ్రవరి 2023న జాతికి అంకితం చేయనున్న కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించే నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాంగా ఏటీఎఫ్‌లు జాతికి అంకితం

Posted On: 08 FEB 2023 1:16PM by PIB Hyderabad

25 వ్యసన విముక్తి చికిత్స కేంద్రాలు (ఏటీఎఫ్‌లు) 9 ఫిబ్రవరి 2023న జాతికి అంకితం కానున్నాయి. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, న్యూదిల్లీలోని 15 జనపథ్‌లో ఉన్న భీమ్ ఆడిటోరియంలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో 09.02.2023న ఉదయం 11:00 గంటలకు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా వ్యసన విముక్తి చికిత్స కేంద్రాలను జాతికి అంకితం చేస్తారు.

కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొని, మొత్తం 25 వ్యసన విముక్తి చికిత్స కేంద్రాలను జాతికి అంకితం చేస్తారు.

 

******



(Release ID: 1897377) Visitor Counter : 148