ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రభుత్వం తీసుకున్న క్రియాశీల చర్యలతో ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిలో ద్రవ్యోల్బణం


2022 డిసెంబర్ లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 5.7 శాతానికి, 5.0 శాతానికి తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం

2024 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వస్తువుల ధరల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం ప్రమాదాలు తక్కువగా ఉండే అవకాశం

Posted On: 31 JAN 2023 1:54PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) అమలు చేసిన  తగిన సమయంలో అమలు చేసిన సత్వర చర్యలు ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించాయి.  ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిలో ద్రవ్యోల్బణం ఉంది అని  2022-23 ఆర్థిక సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక  కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2022-23 ఆర్థిక సర్వేను  పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 

వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం: (సిపిఐ)
భారతదేశంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 2022 లో మూడు దశలను దాటిందని సర్వే పేర్కొంది. 2022 ఏప్రిల్ వరకు పెరుగుదల నమోదు చేసిన ద్రవ్యోల్బణం 7.8 శాతానికి, ఆ తర్వాత 2022 ఆగస్టు వరకు 7.0 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం తగ్గి 2022 డిసెంబర్ నాటికి 5.7 శాతానికి పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వేడి, వర్షాభావ పరిస్థితుల వల్ల  పంట దిగుబడులు తగ్గడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించాయి.  

కేంద్ర  ప్రభుత్వం,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ)  అమలు చేసిన  తగిన సమయంలో అమలు చేసిన సత్వర చర్యలు ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించాయి.  ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిలో ద్రవ్యోల్బణం ఉంది. వర్షాలు సక్రమంగా కురవడంతో అవసరమైన స్థాయిలో   ఆహార ధాన్యాల  సరఫరా  సాధ్యమయ్యింది. 
టోకు ధరల ద్రవ్యోల్బణం: (డబ్ల్యుపిఐ)
కోవిడ్ -19 కాలంలో డబ్ల్యుపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం తక్కువగా ఉందని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. మహమ్మారి తర్వాత , ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో   టోకు ధరల ద్రవ్యోల్బణం ఊపందుకుంది అని సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర సరుకుల స్వేచ్ఛాయుత రవాణాతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులను  రష్యా-ఉక్రెయిన్ వివాదం  మరింత దిగజార్చింది. ఫలితంగా 2022 ఆర్థిక సంవత్సరంలో టోకు ద్రవ్యోల్బణం రేటు 13.0 శాతానికి పెరిగింది. 2022 మే నెలలో గరిష్టంగా 16.6 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ 2022 సెప్టెంబర్ లో 10.6 శాతానికి, 2022 డిసెంబర్ లో 5.0 శాతానికి పడిపోయింది.

డబ్ల్యూపీఐ పెరుగుదలకు కొంతవరకు ఆహార ద్రవ్యోల్బణం, కొంతమేర దిగుమతి ద్రవ్యోల్బణం కారణమని ఆర్థిక సర్వే  పేర్కొంది. అంతర్జాతీయంగా పెరిగిన వంట నూనెల ధరలు  ప్రభావం దేశీయ ధరలపై కూడా ప్రభావం చూపించింది.  2023 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో భారత మారకపు రేటు కూడా ప్రతికూలంగా ప్రభావితమైంది. దీనివల్ల దిగుమతి చేసుకున్న ముడిసరుకుల ధరలు పెరిగాయి.
డబ్ల్యుపిఐ, సిపిఐ ధోరణులు:
సాపేక్షంగా అధిక టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం, తక్కువ వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ద్రవ్యోల్బణం మధ్య వ్యత్యాసం 2022 మే లో పెరుగుదల నమోదైంది. ప్రధానంగా రెండు సూచీల సాపేక్ష బరువులలో వ్యత్యాసం, రిటైల్ ధరలపై దిగుమతి చేసుకున్న ముడిపదార్ధాలు ధరలు  ప్రభావం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటి నుంచి ద్రవ్యోల్బణం  రెండు కొలతల మధ్య అంతరం తగ్గింది, ఇది ఏకీకరణ ధోరణిని ప్రదర్శిస్తుంది అని సర్వే నివేదిక పేర్కొంది. 

 


డబ్ల్యూపీఐ, సీపీఐ సూచీల మధ్య సమన్వయం ప్రధానంగా రెండు అంశాలతో ముడిపడి ఉందని సర్వే పేర్కొంది. దీనికి మొదటి కారణం ముడి చమురు, ఇనుము, అల్యూమినియం, పత్తి వంటి వస్తువుల ధరలు తగ్గడంతో తక్కువ డబ్ల్యుపిఐకి దారితీసింది. రెండవది, సేవల ధరల పెరుగుదల కారణంగా సిపిఐ ద్రవ్యోల్బణం పెరిగింది.
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం:
రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహనిర్మాణం, జౌళి,  ఫార్మాస్యూటికల్ రంగాల నుంచి ఉత్పన్నమవుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రధానంగా అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా ప్రభావితం అయ్యిందని సర్వే పేర్కొంది. 2022 ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఆహార ద్రవ్యోల్బణం 4.2 శాతం నుంచి 8.6 శాతం మధ్య ఉంది. ప్రపంచ ఉత్పత్తి తగ్గడం, వివిధ దేశాలు ఎగుమతి పన్ను విధించడంతో  2022 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు పెరిగాయి. భారతదేశం తన వంట నూనెల డిమాండ్ లో 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది.  ఇది ధరలలో అంతర్జాతీయ కదలికలకు గురవుతుంది.

దేశంలో  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం రేటు లో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. అనేక  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో  ప్రస్తుత సంవత్సరంలో పట్టణ ప్రాంతాలతో  పోల్చి చూస్తే  గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం  ఎక్కువగా ఉంది.   గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని సర్వేర్య్ పేర్కొంది.

ధరల పెరుగుదల నుంచి  బలహీన వర్గాలకు చెందిన ప్రజలను  రక్షించడానికి 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు అందించడానికి ప్రభుత్వం 2023 జనవరి 1 న 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' అనే కొత్త సమగ్ర ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించింది.
ధరల స్థిరత్వానికి విధానపరమైన చర్యలు:
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్) కింద పాలసీ రెపో రేటును 225 బేసిస్ పాయింట్లు 4.0 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, గోధుమ ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం, బియ్యం ఎగుమతిపై  సుంకం విధించడం, పప్పు దినుసులపై దిగుమతి సుంకాలు, సెస్ తగ్గింపు, సుంకాల హేతుబద్ధీకరణ, వంటనూనెలు, నూనె విత్తనాలపై నిల్వ పరిమితి విధించడం, ఉల్లి, పప్పు దినుసుల బఫర్ స్టాక్ నిర్వహణ, తయారీ ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థాలపై దిగుమతి సుంకాల హేతుబద్ధీకరణ వంటి ఆర్థిక చర్యలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. 

 


భారత ద్రవ్యోల్బణ నిర్వహణ భిన్నంగా గుర్తించదగిన అంశంగా ఉంది. ద్రవ్యోల్బణం రేట్లతో సతమతమవుతున్న అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల తో భారత ఆర్థిక వ్యవస్థను  పోల్చవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో మందగమనం ఉంటుందని అంచనా. దీనివల్ల, ప్రపంచ వస్తువుల  ధరల ప్రభావం వల్ల ఏర్పడే  ద్రవ్యోల్బణం ప్రమాదాలు 2023 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో తక్కువగా ఉండే అవకాశం ఉంది.   2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ సవాలు ఈ సంవత్సరం కంటే చాలా తక్కువగా ఉంటుందని ఆర్థిక  సర్వే అంచనా వేసింది. 

 

***



(Release ID: 1895030) Visitor Counter : 950