ప్రధాన మంత్రి కార్యాలయం

వసంత పంచమి... సరస్వతీ పూజ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 26 JAN 2023 2:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వసంత పంచమి, సరస్వతీ పూజ పర్వదినాల నేపథ్యంలో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
 

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

"వసంత పంచమి సరస్వతీ పూజ పవిత్ర పర్వదినాలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. విద్యాప్రదాయని అయిన సరస్వతీమాత ఆరాధనతో ముడిపడిన ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1893952) Visitor Counter : 121