ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ భవన శిల్పి డాక్టర్ బి.వి. దోశి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపినప్రధాన మంత్రి

Posted On: 24 JAN 2023 1:53PM by PIB Hyderabad

ప్రముఖ భవన శిల్పి డాక్టర్ బి.వి. దోశి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డాక్టర్ బి.వి. దోశి గారు సూక్ష్మబుద్ధి కలిగిన భవన శిల్పి; అంతేకాకుండా, ప్రశంసాయోగ్య సంస్థ ను కూడా ఆయన తీర్చిదిద్దారు. భారతదేశం అంతటా ఆయన రూపుదిద్దిన వాస్తు కళ సంబంధి నిర్మాణాల ను ప్రశంసించడం ద్వారా భావి తరాల వారు ఆయన గొప్పతనం ఎంతటిదో గ్రహిస్తారు. ఆయన మనలను వీడి వెళ్ళిపోవడం దుఃఖదాయకం గా ఉంది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారికి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1893262) Visitor Counter : 153