ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని మోతీహారిలో ఇటుకబట్టీ పేలుడులో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటన

Posted On: 24 DEC 2022 9:47AM by PIB Hyderabad

   బీహార్‌లోని మోతిహారిలో ఇటుకబట్టీ పేలుడు సంఘటన వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారం అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “మోతిహారిలోని ఇటుకబట్టీ పేలుడు దుర్ఘటనలో ప్రాణనష్టం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌’ నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇవ్వబడుతుంది:PM @narendramodi” అని పేర్కొంది.

******

DS/ST


(Release ID: 1886437) Visitor Counter : 171