ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండొనేశియా లో భూకంపం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు తీవ్ర దుఃఖాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 22 NOV 2022 1:43PM by PIB Hyderabad

ఇండొనేశియా లో భూకంపం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని మరియు వ్యధ ను వ్యక్తం చేశారు. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలని ఆయన ఆకాంక్షిస్తూ, ఈ దుఃఖ ఘడియ లో ఇండొనేశియా వెన్నంటి భారతదేశం నిలబడుతుందని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఇండొనేశియా లో భూకంపం వల్ల ప్రాణనష్టం వాటిల్లడంతో పాటుగా సంపత్తి నష్టం సంభవించినందుకు కూడాను నేను దుఃఖిస్తున్నాను. బాధితుల కు మరియు వారి కుటుంబాల కు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు శీఘ్ర గతి న తిరిగి స్వస్థత ను పొందాలని కోరుకొంటున్నాను. ఈ దుఃఖ ఘడియ లో భారతదేశం ఇండొనేశియా వెన్నంటి నిలబడుతుంది’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 



(Release ID: 1878007) Visitor Counter : 122