ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ లోని రీవా లో జరిగిన విషాదాంత రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టంసంభవించినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్నిఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు
Posted On:
22 OCT 2022 11:26AM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ లోని రీవా లో విషాదాంత రహదారి దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో చనిపోయిన వ్యక్తులలో ప్రతి ఒక్కరి కి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికుల కు చెల్లించడం జరుగుతుందని, అలాగే దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు. బాధితుల కు రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సాయపడుతోందని కూడా ప్రధాన మంత్రి తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘మధ్య ప్రదేశ్ లోని రీవా లో జాతీయ రహదారి పైన జరిగిన దుర్ఘటన హృదయవిదారకం గా ఉంది. దీనిలో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా ప్రగాఢ సంతాపం. దీనితో పాటు గా గాయపడ్డ వారందరు శీఘ్రం గా పున:స్వస్థులు కావాలని నేను కోరుకొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం బాధితుల కు సాధ్యమైన అన్ని విధాలు గాను సాయపడడం లో తలమునకలు గా ఉంది.’’
‘‘మధ్య ప్రదేశ్ లో జరిగిన విషాదాంత బస్సు ప్రమాదం లో చనిపోయిన వ్యక్తుల దగ్గరి బంధువుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి ( పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి చెల్లించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు. గాయ పడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
*****
DS/TS
(Release ID: 1870309)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam