ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్లో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపినప్రధాన మంత్రి   

Posted On: 18 OCT 2022 2:02PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ దుర్ఘటన సంభవించిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ దుర్ఘటన సంభవించిందని తెలిసి కలత చెందాను. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు కలిగిన శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

 

*****

DS/ST



(Release ID: 1868807) Visitor Counter : 118