సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు ప్రధాన మీడియా ఛానెల్: శ్రీ అనురాగ్ ఠాకూర్
" విభజనవాద చర్చలు ఛానెల్ యొక్క విశ్వసనీయతను తగ్గిస్తాయి, కల్పన లేకుండా వార్తలను అందించేందుకు పాత్రికేయులు బాధ్యత వహించాలి"
ఏ ఐ బీ డీ (AIBD) 47వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
ప్రసార భారతి సీ ఈ ఓ శ్రీ మయాంక్ అగర్వాల్కు 2022 జీవితకాల సాఫల్య పురస్కారం
Posted On:
20 SEP 2022 9:47AM by PIB Hyderabad
కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు ఆసియా-పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ (AIBD) 47వ వార్షిక సమావేశం మరియు 20వ సభలను కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సమాచార మరియు ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మరియు డైరెక్టర్, ఏ ఐ బీ డీ శ్రీమతి ఫిలోమినా జ్ఞానప్రగసం సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు కొత్త యుగం డిజిటల్ ప్లాట్ఫారమ్ల నుండి కాదని, ప్రధాన స్రవంతి మీడియా ఛానెల్ లే అని అన్నారు. వాస్తవాలను తెలపడం , సత్యాలను చూపించడం, అన్ని పక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి వేదికను అందించడమే నిజమైన జర్నలిజం అని ఆయన అన్నారు.
విభజన వాదం, తప్పుడు కథనాలను వ్యాప్తి చేసే అతిథులను ఆహ్వానించడం మరియు వారి ఊపిరితిత్తులు పగిలేట్టు కేకలు వేయడం ఛానెల్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. “అతిథి, స్వరం మరియు దృశ్యాలకు సంబంధించి మీ నిర్ణయాలు, విశ్వసనీయమైన మరియు పారదర్శకమైన వార్తలు ప్రేక్షకుల దృష్టిలో మీ ఛానల్ విశ్వసనీయతను నిర్వచిస్తాయి. మీ కార్యక్రమాన్ని చూడటానికి వీక్షకుడు ఒక్క నిమిషం ఆగిపోవచ్చు, కానీ మీ యాంకర్ను, మీ ఛానెల్నూ లేదా మీ బ్రాండ్ను ఎప్పటికీ విశ్వసించరు” అని ఆయన అన్నారు.
కథనాన్ని సౌండ్బైట్ల ద్వారా నిర్వచించ చూడవద్దని, అతిథులు మరియు ఛానెల్ యొక్క స్థాయి ని పెంచే విధంగా మీరే నిబంధనలను రూపొందించకోండి మీరే పునర్నిర్వచించండి అని మంత్రి ఈ సందర్భంగా హాజరైన ప్రసారదారులకు ఉద్బోధించారు.
ప్రేక్షకులకు ఉత్తేజకరమైన ప్రశ్నలను సంధిస్తూ “యువ ప్రేక్షకులు టీవీ వార్తల కార్యక్రమాలను మార్చుతున్నారా లేదా పోటీలో ముందుండడానికి మీరు వార్తలలో నిస్పాక్షికతని మరియు చర్చా కార్యక్రమాలలో వివేచనను తిరిగి తీసుకురాబోతున్నారా? ” అని మంత్రి అడిగారు
కోవిడ్ మహమ్మారి సమయంలో సభ్య దేశాలను ఆన్లైన్లో సంధానం చేసి, మహమ్మారి ప్రభావాన్ని ఎలా తగ్గించవచ్చనే దానిపై మీడియా స్థిరమైన ప్రయత్నాలను కొనసాగించినందుకు శ్రీ అనురాగ్ ఠాకూర్ ఏ ఐ బీ డీ నాయకత్వాన్ని అభినందిచారు. "వైద్య రంగంలో తాజా పరిణామాలు, కోవిడ్ యోధులపై సానుకూల కథనాలు మరియు ముఖ్యంగా మహమ్మారి కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు చాలా ప్రయోజనం పొందాయి" అని ఆయన పేర్కొన్నారు. ఏ ఐ బీ డీ డైరెక్టర్ శ్రీమతి ఫిలోమినా, ఏ ఐ బీ డీ జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, శ్రీ మయాంక్ అగర్వాల్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కోవిడ్ మహమ్మారిపై బలమైన మీడియా ప్రతిస్పందనను చైతన్యాన్ని నిర్మించడంలో కలిసి పనిచేసిన సభ్య దేశాలను శ్రీ ఠాకూర్ అభినందించారు.
' మహమ్మారి అనంతర యుగంలో ప్రసార రంగానికి బలమైన భవిష్యత్తును నిర్మించడం' అనే సమావేశ లక్ష్యం పై మంత్రి మాట్లాడుతూ, “ప్రసార మాధ్యమం ఎల్లప్పుడూ జర్నలిజం యొక్క ప్రధాన స్రవంతిలో ఉన్నప్పటికీ, కోవిడ్-19 యుగం దాని నిర్మాణాన్ని మరింత వ్యూహాత్మక మార్గం లో రూపొందించింది. కోవిడ్ మహమ్మారి కి సంబందించిన సరైన మరియు సమయానుకూల సమాచారం కోట్లాది మంది జీవితాలను ఎలా సంరక్షించగలదో నేర్పింది. ఈ క్లిష్ట దశలో ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది మరియు ఏకైక వసుదైక కుటుంబం స్ఫూర్తిని బలోపేతం చేసింది మీడియా. “మహమ్మారి సమయంలో భారతీయ మీడియా పాత్రను విజయగాథగా ప్రదర్శిస్తూ, కోవిడ్-19 అవగాహన సమచారం, సందేశాలు, ముఖ్యమైన ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు వైద్యులతో ఉచిత ఆన్లైన్ సంప్రదింపులు దేశంలోని నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరికీ చేరేలా మీడియా తన దైన పాత్ర పోషించింది.
మంచి నాణ్యమైన వార్తా కార్యక్రమాల ఆదానప్రదానాల విషయంలో సహకారాన్ని నిర్మించుకోవాలని శ్రీ ఠాకూర్ సభ్య దేశాలను ప్రోత్సహించారు. అటువంటి కార్యక్రమ మార్పిడి సహకారం ద్వారా ప్రపంచ సంస్కృతులను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. దేశాల మధ్య ఇటువంటి మీడియా భాగస్వామ్యాలు బలమైన సామాజిక బంధాలను నిర్మించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు.
ముగింపులో, సాధికారతకు సమర్థవంతమైన సాధనంగా ప్రజల అవగాహనలను మరియు దృక్పథాలను రూపొందించడంలో మీడియా దాని అన్ని రూపాల్లో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి నొక్కిచెప్పారు. " "జర్నలిస్టులు మరియు ప్రసార మిత్రులు మరింత ఉత్సాహవంతంగా సానుకూలంగా పనిచేయడానికి వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం అత్యవసరం" అని ఆయన చెప్పారు.
ప్రసార భారతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఏ ఐ బీ డీ ప్రెసిడెంట్ శ్రీ మయాంక్ అగర్వాల్ తన ప్రసంగంలో, ఏ ఐ బీ డీ లాక్డౌన్ల సమయంలో కూడా శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను కొనసాగించింది. గత ఏడాదిలోనే 34 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయంతో పాటు వాతావరణ మార్పు, హరిత సాంకేతికతలు, స్థిరమైన అభివృద్ధి, వేగవంతమైన రిపోర్టింగ్, పిల్లలకు కార్యక్రమాలు మొదలైన వాటిపై దృష్టి సారించారు.
బ్రాడ్కాస్టింగ్ రంగం లో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్ సెక్యూరిటీ జర్నలిజంలో జర్నలిస్టులకు శిక్షణ తప్పనిసరి అని అగర్వాల్ చెప్పారు. ఏ ఐ బీ డీ తన శిక్షణా కార్యక్రమాలలో భాగంగా దీనిని చేపట్టడానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని అని ఆయన తెలిపారు.
శ్రీమతి జ్ఞానప్రగాసం మాట్లాడుతూ, కంటెంట్ మీడియా భవిష్యత్తును నిర్దేశిస్తుందని, కంటెంట్ భాగస్వామ్యంతో ఎలా నిర్మించబడి డబ్బు ఆర్జించబడుతుందో అదే ప్రసార రంగ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన 2021 మరియు 2022 లకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రేడియో టెలివిజన్ బ్రూనైకి 2021కి ప్రశంసా పురస్కారం లభించింది. 2022కి సంబంధించిన ప్రశంసా పురస్కారాన్ని ఆర్థిక, పౌర సేవ, కమ్యూనికేషన్స్, గృనిర్మాణానికి మరియు సామాజిక అభివద్ది, రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ మరియు ఫిజీ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖలు పంచుకున్నాయి.
2021కి లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు కంబోడియాలోని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి ఖియు ఖాన్హరిత్కి ఇవ్వబడింది. 2022 జీవితకాల సాఫల్య పురస్కారం సీ ఈ ఓ, పి బీ మరియు ఏ ఐ బీ డీ అధ్యక్షుడు. శ్రీ మయాంక్ అగర్వాల్ ప్రదానం చేశారు
భారతదేశంలోని వివిధ విదేశీ మిషన్ల అధిపతులు, ఏ ఐ బీ డీ సభ్య దేశాల నుండి ప్రతినిధులు, ప్రసార భారతి నుండి అధికారులు మరియు భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏ ఐ బీ డీ గురించి
ఆసియా-పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ (ఏ ఐ బీ డీ) యునెస్కో (UNESCO) ఆధ్వర్యంలో 1977లో స్థాపించబడింది. ఇది ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ధి రంగంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (UN-ESCAP) దేశాలకు సేవలందిస్తున్న ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ అంతర్-ప్రభుత్వ సంస్థ. ఇది మలేషియా ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది అలాగే సచివాలయం కౌలాలంపూర్లో ఉంది.
ఏ ఐ బీ డీ లో ప్రస్తుతం 43 సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తున్న 26 పూర్తి సభ్యులు (దేశాలు), మరియు 50 అనుబంధ సభ్యులు (సంస్థలు) మొత్తం 93 మంది సభ్యత్వంతో 46 దేశాలు మరియు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరియు ఆసియా, పసిఫిక్, యూరప్, ఆఫ్రికా, అరబ్ రాష్ట్రాలు మరియు 50 మంది భాగస్వాములు ఉన్నారు.
ఉత్తర అమెరికా
ఏ ఐ బీ డీ జనరల్ కాన్ఫరెన్స్ (GC) మరియు దాని అనుబంధ సమావేశాలు సంస్థ యొక్క వార్షిక అధికారిక సమావేశం. జనరల్ కాన్ఫరెన్స్ సభ్య దేశాలు, అనుబంధ సంస్థలు, భాగస్వాములు, పరిశీలకులు మరియు ప్రముఖ ప్రసారకర్తలకు ఆహ్వానం ద్వారా మాత్రమే హాజయ్యేందుకు అవకాశముంది. సభ్య దేశాలు, అనుబంధ సంస్థలు మరియు భాగస్వాములు ఏ ఐ బీ డీ గత సంవత్సరంలో అమలు చేసిన కార్యకలాపాలు మరియు ప్రాజెక్ట్ల సంఖ్యను సమీక్షించడానికి మరియు భవిష్యత్తు ప్రాజెక్ట్లను పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సభ్య దేశాల అభివృద్ధి అవసరాలపై కూడా చర్చిస్తారు.
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు ఏ ఐ బీ డీ లో పూర్తి సభ్యత్వం ఉంది. భారతదేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి ఏ ఐ బీ డీ యొక్క వివిధ సేవలను ఉపయోగించుకుంటుంది.
భారతదేశం 1978, 1985, 2003లో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి 19-21 సెప్టెంబర్, 2022 నుండి న్యూఢిల్లీలో 47వ వార్షిక సమావేశం/20వ ఏ ఐ బీ డీ జనరల్ కాన్ఫరెన్స్ మరియు అనుబంధ సమావేశాలు 2022కి ఆతిథ్యమిచ్చే గౌరవాన్ని మళ్లీ పొందింది.
***
(Release ID: 1860866)