ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ లాజిస్టిక్స్ విధానం విడుదల చేసిన ప్రధానమంత్రి
“భారతదేశం తయారీ హబ్ గా మారుతోందన్న అభిప్రాయం ప్రపంచం దృష్టిలో స్థిరపడుతోంది”
“ఈ పాలసీ ఆరంభం మాత్రమే, పురోగతికి విధానంతో పాటు పనితీరు కూడా ప్రధానం”
“జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆకస్మికంగా వచ్చింది కాదు, దాని వెనుక 8 సంవత్సరాల శ్రమ ఉంది”
“ప్రస్తుతం 13-14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలు వీలైనంత త్వరలో ఒక అంకె స్థాయికి దింపాల్సి ఉంది”
“యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ఫారం - యులిప్; రవాణా రంగానికి చెందిన అన్ని డిజిటల్ సర్వీసులు ఒకే వేదిక పైకి”
“గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం కలిసికట్టుగా దేశాన్ని కొత్త పని సంస్కృతి దిశగా నడిపిస్తాయి”
“అభివృద్ధి చెందిన దేశంగా మారాలని నిశ్చయంగా ఉన్న భారత్ అభివృద్ధి చెందిన దేశాలతో మరింతగా పోటీ పడాల్సి ఉంది, అప్పుడే అన్నీ పోటీ సామర్థ్యం గలవిగా మారతాయి”
“మౌలిక వసతుల అభివృద్ధి, వ్యాపారాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపునకు జాతీయ లాజిస్టిక్స్ విధానంలో అద్భుతమైన అవకాశాలున్నాయి”
Posted On:
17 SEP 2022 7:41PM by PIB Hyderabad
విజ్ఞాన్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్ విధానం (ఎన్ఎల్ పి) విడుదల చేశారు.
అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న భారతదేశం ఆకాంక్షను సాకారం చేసే దిశగా పడిన పెద్ద అడుగే ఈ జాతీయ లాజిస్టిక్స్ విధానమని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి అన్నారు. “చివరి ప్రదేశానికి కూడా వేగవంతంగా వస్తుసేవలను అందించేందుకు, రవాణాపరమైన సవాళ్లకు ముగింపు పలికేందుకు, తయారీదారులకు కాలం, సమయం కూడా ఆదా చేసేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల వృధాను నివారించేందుకు గట్టి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలకు చక్కని ఉదాహరణే నేటి జాతీయ లాజిస్టిక్స్ విధానం” అని ప్రధానమంత్రి చెప్పారు. దీని ఫలితంగా సమన్వయంలో ఏర్పడే మెరుగుదల ఆ రంగంలో వేగం పెరగడానికి దోహదపడుతుంది.
ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. నేటి ఉదయం విడుదల చేసిన చిరుత పులుల గురించి ప్రస్తావిస్తూ మనందరం చిరుత వలెనే లగేజి వేగంగా కదలాలని కోరుకుంటాం అని ఆయన వ్యాఖ్యానించారు.
“మేక్ ఇన్ ఇండియా, దేశం స్వయం-సమృద్ధం కావాలన్న ఆకాంక్ష ప్రతీ ఒక్క చోట కనబడుతున్నాయి. భారతదేశం భారీ ఎగుమతి లక్ష్యాలు ఏర్పరచుకోవడమే కాదు, వాటిని సాధించేందుకు కూడా కృషి చేస్తోంది. భారతదేశం తయారీ హబ్ గా మారుతోందన్న అభిప్రాయం ప్రపంచంలో స్థిరపడుతోంది. మనం పిఎల్ఐ పథకం గురించి అధ్యయనం చేసినట్టయితే ప్రపంచం దాన్ని ఆమోదించిందని మనం గుర్తిస్తాం” అని ప్రధానమంత్రి అన్నారు.
ఈ పరిస్థితిలో జాతీయ లాజిస్టిక్స్ విధానం అన్ని రంగాలకు నూతన శక్తిని అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ విధానం ఒక ఆరంభం మాత్రమే, పురోగతి కోసం ఈ పాలసీకి పనితీరు సైతం జోడు కావాలి అని ఆయన వివరించారు. “నేడు భారతదేశం ఏ విధానం తీసుకురావాలన్నా ముందస్తుగా దానికి అవసరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తుంది, అప్పుడే విధానం విజయవంతంగా అమలు పరుస్తుంది. జాతీయ లాజిస్టిక్స్ విధానం ఏదో హడావిడిగా వచ్చింది కాదు, 8 సంవత్సరాల శ్రమ దాని వెనుక ఉంది. ఎన్నో పాలసీ మార్పులు చోటు చేసుకుంటాయి, ఎన్నోనిర్ణయాలు వస్తాయి. నా 22 సంవత్సరాల పరిపాలనానుభవం దాని వెనుక ఉంది” అని ఆయన చెప్పారు.
సాగర్ మాల, భారత్ మాల వంటి పథకాలు, ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల నిర్మాణం వేగవంతం చేయడం వంటివి లాజిస్టిక్స్ కనెక్టివిటీకి అవసరం అయిన వ్యవస్థీకృత మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాయి. భారతీయ పోర్టుల్లో మొత్తం సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని, కంటైనర్ నౌకల ప్రయాణ కాలపరిమితి 44 గంటల నుంచి 26 గంటలకు తగ్గిందని శ్రీ మోదీ సూచించారు. ఎగుమతుల వృద్ధికోసం 40 వైమానిక కార్గో టెర్మినల్స్ ఏర్పాటయ్యాయి, 30 విమానాశ్రయాల్లో శీతలీకరణ వసతులు కల్పించడం జరిగింది., 35 మల్టీ మోడల్ హబ్ లు దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి అని ప్రధానమంత్రి చెప్పారు. “జల మార్గాల ద్వారా పర్యావరణ మిత్రమైన, పొదుపుతో కూడిన రవాణా వసతులు మనం కల్పించగలుగుతాం. ఇందుకోసం దేశంలో కొత్త జలమార్గాల ఏర్పాటు కూడా జరుగుతోంది” అని ప్రధానమంత్రి తెలిపారు. కరోనా కష్టకాలంలో జరిగిన కిసాన్ రైల్, కిసాన్ ఉడాన్ ప్రయోగాల గురించి ఆయన ప్రస్తావించారు. నేడు దేశంలోని 60 విమానాశ్రయాలలో కృషి ఉడాన్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.
లాజిస్టిక్స్ రంగం పటిష్ఠతకు టెక్నాలజీని అమలుపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఇందులో భాగంగా ఇ-సంచిత్ ద్వారా పేపర్ లెస్ గా ఎగ్జిమ్ వ్యాపార ప్రాసెసెంగ్, కస్టమ్స్ కోసం ఫేస్ లెస్ అసెస్ మెంట్, ఇ-వే బిల్లులు, ఫాస్టాగ్ వంటి వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చొరవ తీసుకున్నదని ఆయన చెప్పారు. ఇవన్నీ లాజిస్టిక్స్ విభాగం సమర్థతను గణనీయంగా పెంచాయని తెలిపారు. అంతే కాదు, లాజిస్టిక్స్ రంగం సమస్యలు తేలిగ్గా పరిష్కరించడానికి జిఎస్ టి వంటి ఏకీకృత పన్ను వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. డ్రోన్ పాలసీ, డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పిఎల్ఐ పథకంతో అనుసంధానం చేయడం వంటి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. “ఇలాంటివి ఎన్నో చేసిన అనంతరం జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆవిష్కరిం చాం” అని ఆయన వివరించారు. “లాజిస్టిక్స్ వ్యయాలను 13-14 శాతం నుంచి ఒకే అంకె స్థాయికి వీలైనంత త్వరలో తీసుకురావడం మన ధ్యేయం కావాలి. మనం ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యం సాధించాలంటే ఇది అందుబాటులో ఉన్న ఫలమే” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫారం లేదా యులిప్ రవాణా రంగానికి చెందిన డిజిటల్ సేవలన్నింటినీ ఒకే చోటికి తెస్తుంది, ఎగుమతిదారులకు సుదీర్ఘ, సంక్లిష్ట ప్రాసెస్ నుంచి విముక్తం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ఈ విధానం ద్వారా సేవల్లో సరళత కోసం కొత్త డిజిటల్ వేదిక ఇ-లాగ్స్ కూడా