హోం మంత్రిత్వ శాఖ
యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ II మరణించినందున, గౌరవ సూచకంగా సెప్టెంబర్ 11న ఒకరోజు అధికారిక సంతాప దినం
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2022 1:46PM by PIB Hyderabad
యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్ మహారాణి అయిన క్వీన్ ఎలిజబెత్ II సెప్టెంబర్ 8, 2022న మరణించారు. మరణించిన రాణి గౌరవ సూచకంగా భారతదేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 11న అధికారికంగా ఒక రోజు సంతాప దినాన్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
సంతాపదినం రోజున భారత దేశ వ్యాప్తంగా జాతీయ జెండా నిత్యం ఎగిరే ప్రతి భవనంపైన జాతీయ జెండాను అవనతం చేయడమే కాక, ఆ రోజున అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరు.
***
(రిలీజ్ ఐడి: 1858163)
సందర్శకుల సూచీ సంఖ్య : : 276