పి ఎమ్ ఇ ఎ సి

ఇండియా@100 పోటీతత్వ రోడ్‌మ్యాప్ విడుదల చేసిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి.

Posted On: 30 AUG 2022 1:25PM by PIB Hyderabad

నేడు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(EAC-PM) ఇండియా@100 కోసం పోటీతత్వ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది. ఇండియా కాంపిటీటివ్‌నెస్ కార్యక్రమంలో భాగమైన రోడ్‌మ్యాప్పీఎం- ఆర్థిక సలహామండలి చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్సభ్యుడు సంజీవ్ సన్యాల్ ఇందులో భాగంగా ఏర్పడిన స్టేక్ హోల్డర్స్ గ్రూప్ సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. ఈ రోడ్‌మ్యాప్ పీఎం-ఈఏసీ, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ మధ్య సంయుక్తంగా నిర్మించారు. దీనిని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన డాక్టర్ అమిత్ కపూర్ అధ్యక్షతనఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ప్రొఫెసర్ మైఖేల్ E. పోర్టర్ మరియు డాక్టర్ క్రిస్టియన్ కెటెల్స్ అభివృద్ధి చేశారు. ఇది రానున్న ఏళ్లల్లో దేశ అభివృద్ధి ప్రయాణానికి కొత్త మార్గదర్శక సూత్రాలను నిర్దేశిస్తుంది. లక్ష్యాలను సాధించడానికి నిర్దిష్ట రోడ్‌మ్యాప్‌లను అభివృద్ధి చేయడానికి భారతదేశ వృద్ధిలో వివిధ రాష్ట్రాలుమంత్రిత్వ శాఖలు మరియు భాగస్వాములకు మార్గనిర్దేశం చేస్తుంది.

ఇండియా@100 కోసం పోటీతత్వ రోడ్‌మ్యాప్ ప్రొఫెసర్ మైఖేల్ ఇ. పోర్టర్ అభివృద్ధి చేసిన కాంపిటీటివ్‌నెస్ ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడింది. పోటీతత్వ విధానం సుస్థిర శ్రేయస్సు కోసం ఉత్పాదకత  అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఒక దేశం సంస్థలకు మరింత ఉత్పాదకతను అందించగలదని.. వ్యక్తులు వారి ఉత్పాదకత ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువలో పాలుపంచుకునేలా చేయగల సందర్భాన్ని ఇది ప్రధానంగా చెబుతుంది. ప్రాంత, సెక్టార్ ఆధారిత నిర్దిష్ట విధానాల ద్వారా 2047 నాటికి భారతదేశం అధిక-ఆదాయ దేశంగా మారడానికి ఈ విధానం, '4 S' సూత్రాల ఆధారంగా నిర్మించబడింది. రోడ్‌మ్యాప్ స్పష్టంగా నిర్వచించబడిన మొత్తం లక్ష్యాలపై ఆధారపడిన కొత్త మార్గదర్శక సూత్రాలను అందించడానికి, సామాజిక- ఆర్థిక ఎజెండాలను ఏకీకృతం చేయడంలో పొందుపరిచిన కొత్త అభివృద్ధి విధానాన్ని అందిస్తుంది. '4 S' మార్గదర్శక సూత్రాలు శ్రేయస్సును సాధించడం కోసం మన విధానాన్ని పునర్నిర్వచించాయి. శ్రేయస్సు పెరుగుదల సామాజిక పురోగతితో సరిపోలే విధంగాభారతదేశంలోని అన్ని ప్రాంతాలలో భాగస్వామ్యం చేయబడాలి. అదేవిధంగా పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడాలి. వివిధ బాహ్య పరిస్థితుల నేపథ్యంలో పటిష్టంగా ఉండాలి. ఈ నాలుగు ముఖ్యమైన అంశాలను సంగ్రహించడం ద్వారా, '4 S' మార్గదర్శక సూత్రాలు సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయి.

 

ప్రొఫెసర్ మైఖేల్ పోర్టర్ మాట్లాడుతూ, “రోడ్‌మ్యాప్‌లో ఉన్న పోటీతత్వ ఫ్రేమ్‌వర్క్ ఒక దేశం యొక్క పోటీతత్వ ప్రాథమికాలపై కార్యాచరణ ప్రణాళికను ఎలా అనువదించాలనే దానిపై వ్యూహాత్మక దృక్పథాన్ని అందిస్తుంది. ఇందులో పరిష్కారం తక్కువ స్థాయిలో ఉండదు. పురోగతిని వేగవంతం చేయడానికి అవసరమైన కీలకమైన ప్రాధాన్యతా రంగాలపై దృష్టి పెట్టడానికి ప్రారంభించే స్పష్టమైన వ్యూహత్మక చర్య ఇది. డాక్టర్ అమిత్ కపూర్ పోటీతత్వ రోడ్‌మ్యాప్ యొక్క సారాంశాన్ని పంచుకున్నారు, “దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి పోటీతత్వ విధానం భారతదేశ ఆర్థిక మరియు సామాజిక విధానానికి మూలస్తంభంగా ఉండాలన్నారు. భారతదేశ విశిష్ట ప్రయోజనాలలో రోడ్‌మ్యాప్ ఫ్యాక్టర్‌లో వివరించిన సిఫార్సులు, కొత్త మార్గదర్శక సూత్రాలువిధాన లక్ష్యాలు మరియు అమలు నిర్మాణంపై ఆధారపడి ఉన్నాయి”. ఈ దిశలో రోడ్‌మ్యాప్ ఒక ముందడుగు. ఇది భారతదేశం యొక్క ప్రస్తుత పోటీతత్వ స్థాయిఎదుర్కొన్న ప్రాథమిక సవాళ్లు, వృద్ధికి గల అవకాశాల గురించి సమగ్ర విశ్లేషణ అంచనాను అందిస్తుంది. ఇంకాఅధిక-ఆదాయ దేశంగా మారడానికి మార్గాన్ని నిర్దేశిస్తూరోడ్‌మ్యాప్ కార్మిక ఉత్పాదకతను మెరుగుపరచడం, శ్రామిక సమీకరణను మెరుగుపరచడంపోటీతత్వ ఉద్యోగ అవకాశాల కల్పనను పెంచడం, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య మరింత సమన్వయంతో విధాన అమలును మెరుగుపరచడం వంటి ముఖ్యమైన చర్యలను సూచిస్తుంది.

ఈ రోడ్‌మ్యాప్‌ను డాక్టర్ క్రిస్టియన్ కెటెల్స్ సమర్పించారు భారతదేశం బలాలు మరియు దాని ప్రత్యేక ప్రయోజనాలపై పూర్తి అవగాహనను పెంపొందించే ప్రాముఖ్యతను తెలిపారు. ఇది దేశం యొక్క మొత్తం జాతీయ విలువ ప్రతిపాదనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. భారతదేశం యొక్క పోటీతత్వ సవాళ్లు మరియు అవకాశాలను అర్థం చేసుకోవడం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అవకాశాలపై అంతర్దృష్టిని పొందడంలో సహాయపడుతుంది. భారతదేశం తన ప్రధాన సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందిప్రపంచం ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది అనే దానిపై ప్రభావం చూపుతుంది అనేది ప్రధానం" అని డాక్టర్ క్రిస్టియన్ కెటెల్స్ మాట్లాడారు.

'ఇండియా- ది కాంపిటేటివ్ ఎడ్జ్అనే అంశంపై EAC-PM ఛైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ప్రసంగిస్తూ,  "భారత అభివృద్ధి పథం వేగంగాఉన్నతంగా, బలంగా ఉద్భవించాలంటేప్రభుత్వ విధానాలు మరియు సంస్థలు, మార్కెట్లు రెండూ పూర్వం ఏర్పాటు చేసినవి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి." అని అన్నారు. పునరుద్ధరించబడిన అభివృద్ధి విధానం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూఅమితాబ్ కాంత్జీ20షెర్పా, "ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోభారత్ తన ప్రజల జీవన సౌలభ్యం మరియు సౌలభ్యం ఆధారంగా స్థిరమైన వృద్ధి నమూనాను అందించడానికి కృషి చేస్తోంది. దాని పరిశ్రమల కోసం వ్యాపారం చేస్తోంది. భారతదేశం కోసం నిర్దేశించబడిన ఆశయాలను సాధించడం మాత్రమే కాకుండా దేశం ఎలా చేరుకుంటుందనే దానిపై కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రోడ్‌మ్యాప్ నిర్ణీత లక్ష్యాలను సాధించే ప్రక్రియకు మార్గదర్శకాలను అందిస్తుంది. తాము పని చేస్తున్న పరివర్తనకు అవసరమైన సూత్రాల మార్పులను వివరిస్తుందని ఆయన తెలిపారు.

ఈ విడుదలలో చొరవలో భాగంగా ఏర్పాటైన స్టేక్‌హోల్డర్ గ్రూప్‌లోని సభ్యుల మధ్య చర్చా కార్యక్రమం జరిగింది. ప్యానెలిస్ట్‌లలో బార్మాల్ట్ మాల్టింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అక్షి జిందాల్, ఆశిష్ ఝలానీఎండీస్క్వేర్ పాండాగురుచరణ్ దాస్రచయితహరి మీనన్డైరెక్టర్ఇండియా కంట్రీ ఆఫీస్, BMGF, హిమాన్షు జైన్ఇండియన్ సబ్‌కాంటినెంట్ అధ్యక్షుడుడైవర్సీరవి వెంకటేశన్గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్సుమంత్ సిన్హాచైర్మన్ & MD, రిన్యూ పవర్ ఉన్నారు. ఈ చర్చ భారతదేశ భవిష్యత్తు వృద్ధి పథానికి సంబంధించిన విలువైన సూచనలను ముందుకు తెచ్చింది.

ఇండియా@100 కోసం పోటీతత్వ రోడ్‌మ్యాప్ భారతదేశ వృద్ధి, అభివృద్ధి వ్యూహానికి పునరుద్ధరించబడిన విధానానికి ఆధారాన్ని అందిస్తుంది. ముందుకు సాగుతున్నప్పుడుదేశంలోని వివిధ పరిశ్రమలుమంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్రాల కోసం కేపీఐలు మరియు రోడ్‌మ్యాప్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. దాని శతాబ్ది సంవత్సరం నాటికి దేశం యొక్క ఆశయాలను చేరుకునే దిశగా ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. వివిధ రంగాలు, రాష్ట్రాలలో అభివృద్ధి విధానంలో మార్పు నేడు విధాన చర్యలను రూపొందించడమే కాకుండా భవిష్యత్ విధానాల రూపకల్పన అమలుపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.

****



(Release ID: 1855833) Visitor Counter : 204