ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కిశ్త్ వాడ్ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం జరగడం పట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ప్రకటించారు

प्रविष्टि तिथि: 31 AUG 2022 8:52AM by PIB Hyderabad

కిశ్త్ వాడ్ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున మరియు గాయపడ్డ వారికి ఏభై వేల రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారం గా ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్ర‌ధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘కిశ్త్  వాడ్ లో జరిగిన దుర్ఘటన దు:ఖం కలిగించింది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు అతి త్వరలో పున:స్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారం గా ఇవ్వడం జరుగుతుంది. క్షతగాత్రుల కు ఏభై వేల రూపాయల వంతున పరిహారం గా ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

*****

DS/ST

 


(रिलीज़ आईडी: 1855817) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam