ప్రధాన మంత్రి కార్యాలయం

బాపు నాయకత్వం లో క్విట్ ఇండియామూవ్ మెంట్ లో పాలుపంచుకొన్న వారు అందరి ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి 

Posted On: 09 AUG 2022 9:35AM by PIB Hyderabad

బాపు నాయకత్వం లో క్విట్ ఇండియా మూవ్ మెంట్ లో పాలుపంచుకోవడం తో పాటు గా మన స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరచినటువంటి వారు అందరి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘బాపు నాయకత్వం లో క్విట్ ఇండియా మూవ్ మెంట్ లో పాలుపంచుకోవడం తో పాటు గా మన స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరచినటువంటి వారు అందరి ని స్మరించుకొంటున్నాను.’’

‘‘బొంబాయి లో క్విట్ ఇండియా మూవ్ మెంట్ ఆరంభం అయినప్పటి మహాత్మ గాంధి చిత్రం ఇదుగో. (నెహ్ రూ స్మారక సంగ్రహాని కి కృత‌జ్ఞ‌త‌ల తో.)’’

లోక్ నాయక్ జె పి ‘‘ఆగస్టు తొమ్మిదో తేదీ మన జాతీయ విప్లవం యొక్క ఒక జ్వలనాత్మకమైనటువంటి ప్రతీక గా మారిపోయింది.’’ అని అన్నారు.

‘‘బాపు నుంచి ప్రేరణ ను పొంది, క్విట్ ఇండియా మూవ్ మెంట్ లో జె పి మరియు డాక్టర్ లోహియా వంటి మహనీయులు సహా సమాజం లోని అన్ని వర్గాల వారి యొక్క విశేష భాగస్వామ్యాన్ని దర్శించడం జరిగింది.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1850299) Visitor Counter : 174