ప్రధాన మంత్రి కార్యాలయం

స్వాతంత్ర‌స‌మ‌ర‌యోధులు లోక‌మాన్య‌తిల‌క్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ జ‌యంతి సంద‌ర్బంగా వారికి నివాళులు అర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 23 JUL 2022 9:41AM by PIB Hyderabad

స్వాతంత్ర స‌మ‌ర‌యోధులు లోక‌మాన్య తిల‌క్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇందుకు సంబంధించి మ‌న్ కీ బాత్ లో వారు లోక‌మాన్య తిల‌క్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌ల గురించి కొద్ది సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌స్తావించిన దానిని షేర్‌చేశారు.త‌న ముంబాయి సంద‌ర్శ‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను కూడా వారుషేర్‌చేశారు. లోక్ మాన్య‌తిల‌క్ తో స‌న్నిహిత సంబంధం క‌లిగిన లోక్‌మాన్య సేవా సంఘ్‌ను ప్ర‌ధాన‌మంత్రి గ‌తంలో సంద‌ర్శించారు.
ఇందుకు సంబంధించి ప‌లు వ‌రుస‌ ట్వీట్లు చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి,

భ‌ర‌త మాత మ‌హోన్న‌త ముద్దుబిడ్డ‌లైన లోక‌మాన్య‌తిల‌క్‌, చంద్ర‌శేఖ‌ర ఆజాద్‌ల‌కు వారి జ‌యంతి సంద‌ర్భంగా శిర‌సువంచి వారికి న‌మ‌స్క‌రిస్తున్నాను. ఈ ఇరువురు మ‌హా నాయ‌కులు ధైర్య‌సాహ‌సాల‌కు, దేశ‌భ‌క్తికి శిఖ‌ర‌స‌మానులు. వారి గురించి కొద్ది సంవ‌త్స‌రాల క్రితం నేను మ‌న్ కీ బాత్ ప్ర‌సంగంలో మాట్లాడిన దానిని ఈ సంద‌ర్భంగా మీకు షేర్ చేస్తున్నాను.

లోక‌మాన్య తిల‌క్  మ‌న‌కందించిన గొప్ప వార‌స‌త్వాల‌లో ఒక‌టి, పెద్ద ఎత్తున జ‌రిగే గ‌ణేష్ ఉత్స‌వాలు. ఇది ప్ర‌జ‌ల‌లో సాంస్కృతిక చైత‌న్యాన్ని ర‌గిలించింది. నా ముంబై ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నేను లోక మాన్య తిల‌క్ తో స‌న్నిహిత అనుబంధం ఉన్న లోక‌మాన్య సేవా సంఘాన్ని సంద‌ర్శించాను, అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.



(Release ID: 1844230) Visitor Counter : 144