ప్రధాన మంత్రి కార్యాలయం

చిత్రకూట్ లో జరిగిన రోడ్డు దుర్ఘటనకారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 09 JUL 2022 4:37PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని చిత్రకూట్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ చిత్రకూట్ లో జాతీయ రాజమార్గం పైన జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం గా ఉన్నది. ఈ దుర్ఘటన లో ప్రియతములను కోల్పోయిన వ్యక్తుల కు నా ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాను. దీనితో పాటే, ఈ ప్రమాదం లో గాయపడ్డ వారు శీఘ్రంగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను : ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 



(Release ID: 1840556) Visitor Counter : 108