ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఖరీఫ్‌ పంటల మార్కెట్‌ సీజన్‌ 2022-23లోకనీస మద్దతు ధరలకు మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం

Posted On: 08 JUN 2022 4:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) మార్కెట్‌ సీజన్‌ 2022-23కు సంబంధించి నిర్దేశిత ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు ప్రతిపాదనను ఆమోదించింది. ఆయా పంటలు పండించిన అన్నదాతలకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు పంటల వైవిధ్యం దిశగా వారిని ప్రోత్సహించడంలో భాగంగా మార్కెట్‌ సీజన్‌ 2022-23కుగాను ఖరీఫ్‌ పంటలకు ‘ఎమ్మెస్పీ’ని ప్రభుత్వం కింది పట్టికలో చూపిన విధంగా పెంచింది.

మార్కెట్‌ సీజన్‌ 2022-23కుగాను ఖరీఫ్‌ పంటలకు

కనీస మద్దతు ధరలు (కింటాలుకు రూ.లలో)

పంట

 

 

ఎమ్మెస్పీ

2014-15

ఎమ్మెస్పీ

2021-22

ఎమ్మెస్పీ

2022-23

2022-23లో *ఉత్పత్తి వ్యయం

ఎమ్మెస్పీ

(మొత్తం) పెరుగుదల

ఉత్పత్తి వ్యయంపై రాబడి (శాతం)

వరి (సాధారణ)

1360

1940

2040

1360

100

50

వరి (గ్రేడ్‌-ఎ)^

1400

1960

2060

-

100

-

జొన్న(హైబ్రిడ్‌)

1530

2738

2970

1977

232

50

జొన్న(మాల్దండి)^

1550

2758

2990

-

232

-

సజ్జ

1250

2250

2350

1268

100

85

రాగి

1550

3377

3578

2385

201

50

మొక్కజొన్న

1310

1870

1962

1308

92

50

కంది (అర్హర్‌)

4350

6300

6600

4131

300

60

పెసర

4600

7275

7755

5167

480

50

మినప

4350

6300

6600

4155

300

59

వేరుసెనగ

4000

5550

5850

3873

300

51

సన్‌ఫ్లవర్‌ గింజలు

3750

6015

6400

4113

385

56

సోయాబీన్స్‌ (పసుపు)

2560

3950

4300

2805

350

53

నువ్వు

4600

7307

7830

5220

523

50

గడ్డి నువ్వులు

3600

6930

7287

4858

357

50

పత్తి (మధ్యరకం పింజ)

3750

5726

6080

4053

354

50

పత్తి (పొడుగు పింజ)^

4050

6025

6380

-

355

-

* వ్యవసాయ కూలీలు, మడక/కూలీ/యంత్రాల కిరాయి, కౌలుకింద భూమికి చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు, కంపోస్టు, నీటిపారుదల రుసుములు వంటి వస్తుపరమైన ఉత్పాదకాల వినియోగ వ్యయం వగైరాలన్నీ చెల్లించిన మొత్తం. పరికరాలు, వ్యవసాయ భవనాలపై తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ ఖర్చు తదితరాలతోపాటు కుటుంబ శ్రమ విలువ ఇందులో భాగంగా ఉంటాయి.

^ వరి (గ్రేడ్-ఎ), జొన్న (మాల్దండి), పత్తి (పొడుగు పింజ) పంటల సాగుపై ఖర్చుల సమాచారం విడిగా సేకరించబడదు.

   మార్కెట్‌ సీజన్ 2022-23లో ఖరీఫ్ పంటలకు ‘ఎమ్మెస్పీ’ పెరుగుదల 2018-19 కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా, సహేతుక లక్ష్యంతో, అఖిలభారత సమీకృత సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అధికంగా రైతుకు న్యాయమైన ధర లభించేలా నిర్ణయించబడింది. ఈ నేపథ్యంలో సజ్జ, కంది, మినప, సన్‌ఫ్లవర్‌ గింజలు, సోయాబీన్స్‌, వేరుసెనగ పంటలకు ఎమ్మెస్పీ 50 శాతం కన్నా అధికం కావడం గమనార్హం. ఈ మేరకు ఆయా పంటలకు ఉత్పత్తి వ్యయంపై వరుసగా 85 శాతం, 60 శాతం, 59 శాతం, 56 శాతం, 53 శాతం, 51 శాతం వంతున ఎక్కువగా ఎమ్మెస్పీ నిర్ణయించబడింది.

   నూనె గింజలు, పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలకు అనువైన రీతిలో ‘ఎమ్మెస్పీ’ని సరిచేయడానికి కొన్నేళ్లుగా సంయుక్త కృషి కొనసాగుతోంది. ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచేవిధంగా రైతులను ప్రోత్సహించడంతోపాటు మెరుగైన సాంకేతికత పరిజ్ఞానాలు, వ్యవసాయ పద్ధతులు అనుసరించేలా చేయడం సహా డిమాండ్-సరఫరాలో అసమతౌల్యం సరిదిద్దడానికీ ప్రయత్నాలు సాగుతున్నాయి.

   దేశంలో 2021-22కి సంబంధించి 3వ ముందస్తు లెక్కల ప్రకారం- ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 314.51 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా వేయబడింది. కాగా, ఇది 2020-21నాటి ఆహార ధాన్యాల ఉత్పత్తికన్నా 3.77 మిలియన్ టన్నులు అధికం. ఈ నేపథ్యంలో గడచిన ఐదేళ్ల (2016-17 నుంచి 2020-21)లో ఆహారధాన్యాల సగటు ఉత్పత్తికన్నా 2021-22లో ఉత్పత్తి 23.80 మిలియన్ టన్నులు ఎక్కువ కావడం విశేషం.

      

 



(Release ID: 1832353) Visitor Counter : 6531