ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు - తెలుగు అనువాదం

Posted On: 23 MAY 2022 4:57PM by PIB Hyderabad

గౌరవనీయులు అధ్యక్షుడు బిడెన్ మరియు గౌరవనీయులు అధ్యక్షుడు   కిషిడా, 

దృశ్య మాధ్యమం ద్వారా అనుసంధానమైన మన నాయకులారా ! 

ఇతర మహనీయులారా !

ఈ రోజు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మీ అందరితో కలిసి ఉండటం నాకు సంతోషాన్నిచ్చింది.  ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ అనేది ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాంతాన్ని సారధిగా మార్చాలనే మన సమిష్టి సంకల్పానికి ప్రతి రూపం.  ఈ ముఖ్యమైన చొరవకు నేను అధ్యక్షుడు బిడెన్‌కి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  ఇండో-పసిఫిక్ ప్రాంతం తయారీ, ఆర్థిక కార్యకలాపాలు, ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడులకు కేంద్రం.  ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వాణిజ్య కార్యకలాపాలలో భారతదేశం శతాబ్దాలుగా ప్రధాన కేంద్రంగా ఉందనడానికి చరిత్ర సాక్ష్యం గా నిలుస్తుంది.  ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాణిజ్య నౌకాశ్రయం భారతదేశంలోని నా సొంత రాష్ట్రమైన గుజరాత్‌ లోని లోథాల్‌ లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల, ఈ ప్రాంతంలోని ఆర్థిక సవాళ్లకు మనం సాధారణ మరియు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం. 

మహనీయులారా !

సమగ్రమైన, సౌకర్యవంతమైన ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌ ను రూపొందించడానికి భారతదేశం మీ అందరితో కలిసి పని చేస్తుంది.  స్థితిస్థాపక సరఫరా వ్యవస్థ కు నమ్మకం, పారదర్శకత, సమయపాలన అనే మూడు ప్రధాన స్తంభాలు ఉండాలని నేను నమ్ముతున్నాను.  ఈ మూడు స్తంభాలను బలోపేతం చేయడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి, శ్రేయస్సు కు ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మార్గం సుగమం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మీ అందరికీ అనేకానేక ధన్యవాదములు. 

*****



(Release ID: 1827826) Visitor Counter : 133