శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

అగ్రి-టెక్ స్టార్టప్ లు భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలకం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


భారత వ్యవసాయ సమస్యలను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం అందించిన విధాన వాతావరణం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో వెల్లువెత్తిన అగ్రిటెక్ స్టార్టప్ లు

మైసూరులోని సి.ఎస్.ఐ.ఆర్- సి.ఎఫ్.టి.ఆర్.ఐ క్యాంపస్ లో "ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియాస్ ఫుడ్ టెక్, అగ్రిటెక్ అండ్ అగ్రోనామిక్ ల్యాండ్ స్కేప్" అనే ఇతివృత్తంతో "టెక్ భారత్" మూడవ ఎడిషన్ ను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి జితేంద్ర సింగ్

భారతదేశంలో పంట మదింపు, భూరికార్డుల డిజిటలైజేషన్, క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడం, పోషకాల కోసం 'కిసాన్ డ్రోన్ల‘ కు ప్రోత్సాహం:డాక్టర్ జితేంద్ర సింగ్

బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ పవర్డ్ కోల్డ్ స్టోరేజీ, ఫెన్సింగ్ ,వాటర్ పంపింగ్, వాతావరణ అంచనా, పిచికారీ యంత్రాలు, విత్తన డ్రిల్స్ ,వర్టికల్ ఫార్మింగ్ వంటి పరిష్కారాలను అందించే స్టార్టప్ లు రైతుల ఆదాయాన్ని పెంచడానికి సహాయపడతాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 20 MAY 2022 12:30PM by PIB Hyderabad

భారత భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అగ్రిటెక్ స్టార్టప్ లు కీలకమని కేంద్ర సైన్స్ , టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , పి ఎం , పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ స్పేస్ శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

అన్నారు.

 

మైసూరులోని రాయల్ సిటీలో అగ్రి-టెక్ అండ్ ఫుడ్-టెక్ పై జరిగిన సదస్సు- ఎగ్జిబిషన్ ను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సప్లై ఛైయిన్ మేనేజ్ మెంట్, కాలం చెల్లిన పరికరాల వినియోగంసక్రమంగా లేని మౌలిక సదుపాయాలు, రైతులు విస్త్రృత శ్రేణి మార్కెట్ లోకి సులభంగా ప్రవేశించలేక పోవడం వంటి భారతీయ వ్యవసాయ సమస్యలను పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం అందించిన విధాన వాతావరణం తో గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అగ్రి-టెక్ స్టార్టప్ లు వెల్లు వెత్తాయని, అన్నారుయువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇప్పుడు తమ సొంత స్టార్టప్ లను స్థాపించడానికి ఐటి రంగాలు , బహుళజాతి సంస్థలలో తమ ఉద్యోగాలను వదులుకుంటున్నారని, యువ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు వ్యవసాయంలో పెట్టుబడులు చాలా తక్కువ , సురక్షితమైనలాభదాయకమైన వ్యాపారాలలో ఒకటని గ్రహించడం ప్రారంభించారని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

 

అగ్రిటెక్ స్టార్టప్ లు వ్యవసాయ విలువ గొలుసు అంతటా ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు సృజనాత్మక ఆలోచనలు , హేతుబద్ధమైన పరిష్కారాలను అందిస్తున్నాయని, ఇది భారతీయ వ్యవసాయ రంగం ముఖచిత్రాన్ని మార్చడానికి , అంతిమంగా రైతుల ఆదాయాన్ని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

రైతులు, ఇన్ పుట్ డీలర్లు, హోల్ సేలర్లు, రిటైలర్లు , వినియోగదారుల మధ్య స్టార్టప్ లు , వర్ధమాన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లోపించిన అనుసంధానంగా మారాయని, ప్రతి ఒక్కరినీ ఒకదానితో మరొకటి అనుసంధానించడం , బలమైన మార్కెటింగ్ లింకేజీలు , నాణ్యమైన ఉత్పత్తులను సకాలంలో అందించడం జరిగిందని ఆయన అన్నారు.

 

 "ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియాస్ ఫుడ్ టెక్, అగ్రిటెక్ & అగ్రోనామిక్ ల్యాండ్ స్కేప్" అనే ఇతివృత్తంతో "టెక్ భారత్ " మూడవ ఎడిషన్ సకాలంలో ఒకటని, ఎందుకంటే భారతీయ జనాభాలో 54 శాతం మంది నేరుగా వ్యవసాయంపై ఆధారపడినందున వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన స్తంభాలలో ఒకటి మాత్రమే గాక ఇది జిడిపిలో 19 (21) శాతం వాటాను కలిగి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

భారత దేశంలో వ్యవసాయ రంగం గత కొన్ని సంవత్సరాల లో సుస్థిర వృద్ధిని

సాధించినప్పటికీ, రంగంలో యువ , తాజాప్ర త్యేక మైన సృజనాత్మక ఆలోచన

లను ప్రోత్సహించడంలో పెద్దగా కృషి జరగలేదని ఆయ అన్నారు.

 

వ్యవసాయ రంగంలో ఆధునిక , కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గట్టిగా సమర్థించారుఇజ్రాయిల్, చైనా , యుఎస్ వంటి దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమ దేశంలో అనేక వ్యవసాయ పద్ధతులను మార్చాయని ఆయన అన్నారు. హైబ్రీడ్ సీడ్స్, ప్రెసిషన్ ఫార్మింగ్, బిగ్ డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియో ట్యాగింగ్ అండ్ శాటిలైట్ మానిటరింగ్, మొబైల్ యాప్స్, ఫార్మ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ ప్రక్రియలో ప్రతి దశలోనూ వర్తింపజేయవచ్చని దేశాలు నిరూపించాయని ఆయన చెప్పారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 100 మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయ డ్రోన్లను ప్రారంభించారని, ఇది ప్రత్యేకమైన ఏకకాల విమానాల్లో వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పంట మదింపు, భూరికార్డుల డిజిటలైజేషన్, క్రిమిసంహారక మందుల పిచికారీ, పోషకాల కోసం 'కిసాన్ డ్రోన్ల' వాడకాన్ని ప్రోత్సహిస్తామని చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఏదైనా వృక్షసంపద లేదా పంట, కలుపు మొక్కలు, అంటువ్యాధులుచీడపీడల వల్ల కలిగే వ్యవసాయ క్షేత్రాల ఆరోగ్యాన్ని మదింపు చేయడానికి కూడా డ్రోన్లను ఉపయోగించవచ్చని, మదింపు ఆధారంగా, వాటితో పోరాడటానికి అవసరమైన రసాయనాల ఖచ్చితమైన మొత్తాలను వర్తింపజేయవచ్చని, తద్వారా రైతుకు మొత్తం ఖర్చును కుదించ వచ్చని మంత్రి తెలిపారు.

 

భారతీయ వ్యవసాయ క్షేత్రం అందులో నిమగ్నమైన జనాభా పరిమాణాన్ని బట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు, అగ్రిటెక్ అంటే ఏమీ కాదని, ఉత్పత్తి, సమర్థత, ఆదాయాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడం మాత్రమే ఆయన అన్నారు. ఇన్పుట్ ఫంక్షన్ లేదా అందుకున్న అవుట్పుట్ కావచ్చు, వ్యవసాయ ప్రక్రియ యొక్క ఏదైనా అంశాన్ని పెంపొందించే ఏవైనా అనువర్తనాలు, పద్ధతులు, ఉత్పత్తులు సేవలకు భావన విస్తరిస్తుందని వివరించారు.

 

భారతదేశంలోని అనేక అగ్రి-టెక్ స్టార్టప్ లు ప్రధానంగా మార్కెట్ ప్లేస్ సెగ్మెంట్ లో ఉన్నాయని, ఇక్కడ -కామర్స్ కంపెనీలు రైతుల నుండి నేరుగా సేకరించిన తాజాసేంద్రీయ పండ్లు ,కూరగాయలను అందిస్తాయని, ఇంకా ఇటీవల అనేక స్టార్టప్ లు రైతుల సమస్యలకు సృజనాత్మక ,స్థిరమైన పరిష్కారాలను అందిస్తున్నాయని మంత్రి చెప్పారు. స్టార్టప్ లు ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్లు, సోలార్ పవర్డ్ కోల్డ్ స్టోరేజీ, ఫెన్సింగ్, వాటర్ పంపింగ్, వాతావరణ అంచనా, పిచికారీ యంత్రాలు, సీడ్ డ్రిల్స్ ,వర్టికల్ ఫార్మింగ్ వంటి పరిష్కారాలను అందిస్తున్నాయని, ఇది రైతుల ఆదాయాన్ని పెంచుతుందని ఆయన అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ తన ముగింపు ప్రసంగంలో, ఇంటర్నెట్ వినియోగం పెరుగుదల, స్మార్ట్ ఫోన్ వ్యాప్తి పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో స్టార్టప్   ఆవిర్భావం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ చొరవలు వ్యవసాయ రంగంలో వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి దోహదపడుతున్నాయని తాను

పూర్తి విశ్వాసం తో  ఉన్నానని చెప్పారు.

వ్యవసాయ రంగంలోని చాలా సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు ఉన్నాయని, అయితే పరిష్కారాలు కేవలం ఒక్క రైతు కు  మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రైతు కు చేర్చడం పెద్ద సవాల్ అని ఆయన అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ లో అత్యంత

కీలక మైన రంగంలో సాంకేతిక

పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున మనం ఉపయోగించు కోవలసిన సమయం వచ్చిందని, తద్వారా వ్యవసాయానికి,

రైతు లోకానికి ప్రయోజనం కల్పించడంతో పాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ కూడా

శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు.

 

మైసూరులోని సి.ఎస్..ఆర్- సి.ఎఫ్.టి.ఆర్. క్యాంపస్ లో జరిగిన కార్యక్రమం లో  నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) చైర్మన్ డాక్టర్ జి.ఆర్. చింతల, సి ఎస్ ఆర్--సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి ఎఫ్ టి ఆర్ ), మైసూరు డైరెక్టర్ డా. శ్రీదేవి అన్నపూర్ణ సింగ్ , లఘు ఉద్యోగ్ భారతి- మైసూరు విభాగం అధ్యక్షుడు శ్రీ మహేష్ షెనాయ్ ఇంకా పలువురు సీనియర్ అధికారులు, ప్రతినిధులు ,ఆహ్వానితులు పాల్గొన్నారు.

                                                     

<><><><><>



(Release ID: 1826932) Visitor Counter : 190