ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్‌ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 07 MAY 2022 1:55PM by PIB Hyderabad

   మ‌ధ్యప్రదేశ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“"మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో అగ్నిప్రమాదం సంభవించడం చాలా బాధ కలిగించింది. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి  తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. PM @narendramodi” అని పేర్కొంది.

***

 

DS/VJ/AK

 



(Release ID: 1823578) Visitor Counter : 134