ప్రధాన మంత్రి కార్యాలయం

అమేఠీ లోని గౌరీగంజ్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టంసంభవించినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 18 APR 2022 11:47AM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని అమేఠీ జిల్లా లో గల గౌరీగంజ్ లో ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అంటూ ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ ఉత్తర్ ప్రదేశ్ లోని అమేఠీ లో గల గౌరీగంజ్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఈ ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఈ ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొంది.

******

DS/ST

 

 



(Release ID: 1817762) Visitor Counter : 139