ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అసంఘటిత కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2022 9:00AM by PIB Hyderabad

అసంఘటిత శ్రమిక సోదరులు మరియు సోదరీమణుల యొక్క సంక్షేమానికి భారత ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన అసంఘటిత శ్రమిక సోదరులు మరియు సోదరీమణుల భాగస్వామ్యం అనేది దేశ అభివృద్ధి లో చాలా ముఖ్యమని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దేశం అభివృద్ధి చెందడం లో మన అసంఘటిత శ్రమిక సోదరులు మరియు సోదరీమణుల భాగస్వామ్యం చాలా మహత్వపూర్ణమైంది గా ఉంది. ఇటువంటి కోట్ల కొద్దీ కార్మికుల జీవనాన్ని సరళతరం గా తీర్చిదిద్దడం కోసం మా ప్రభుత్వం ఎల్లప్పటికీ పాటుపడుతూ వస్తోంది. ఈ పథకాల ద్వారా వారి సామాజిక సురక్ష కు పూచీ లభించడం తో పాటు గా మహమ్మారి కాలం లో సాయపడటం కోసం అనేక చర్యల ను తీసుకోవడం జరిగింది.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1817456) సందర్శకుల సూచీ సంఖ్య : : 198