పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా ఈ రోజు తిరిగి వచ్చిన భారతీయులు 410 మంది


ఇప్పటివరకు ఇలా వెనక్కి వచ్చిన భారతీయులు పద్దెనిమిది వేలమంది

Posted On: 08 MAR 2022 4:54PM by PIB Hyderabad

సుకావా నుంచి రెండు విమానాల సహాయంతో ఈరోజు 410 మంది భారత పౌరులు ఆపరేషన్ గంగా కింద వెనక్కి రాగలిగారు. . దీనితో, ఫిబ్రవరి 22, 2022న ప్రారంభమైన ఈ ప్రయత్నంలో  ప్రత్యేక విమానాల ద్వారా సుమారు 18 వేల మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చారు. 75 ప్రత్యేక పౌర విమానాల ద్వారా వెనక్కి వచ్చిన  భారతీయుల సంఖ్య 15521 కి చేరుకుంది. భారతీయ వాయుసేన  2467 మంది ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి 12 విమానాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ గంగాలో భాగంగా, 32 టన్నులకు పైగా ఉపశమన సామగ్రిని తీసుకువెళ్లారు.

పౌర విమానాలలో, బుకారెస్ట్ నుండి 21 విమానాల ద్వారా 4575 మంది ప్రయాణికులు, 9 విమానాల ద్వారా సూసీవ్ నుండి 1820 మంది, బుడాపెస్ట్ నుండి 28 విమానాల ద్వారా 5571 మంది, కోసిస్ నుండి 5 విమానాల ద్వారా 909 మంది ప్రయాణికులు, ర్జెస్జో నుండి 2404 మంది భారతీయులు, 1242 మంది ప్రయాణికులు. కైవ్ నుండి ఒక విమానం ద్వారా వెనక్కి వచ్చారు.

ఎయిర్‌లైన్ వారీగా డేటా క్రింది విధంగా ఉంది:

విమానయాన సంస్థలు

విమానాల సంఖ్య

వచ్చిన వారి సంఖ్య

ఎయిర్ ఏషియా

3

500

ఎయిర్ ఇండియా

14

3250

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

9

1652

గొ ఫస్ట్

6

1101

ఇండిగో

34

7404

స్పైస్ జెట్

9

1614

ఇప్పటివరకు మొత్తం

75

15521

 

**********



(Release ID: 1804419) Visitor Counter : 153