సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15-16 తేదీలలో 'రీఇమేజింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా'పై తొలిసారిగా ప్రపంచ సదస్సును నిర్వహించనుంది.


సదస్సును ప్రారంభించనున్న కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. జి. కిషన్ రెడ్డి

ఇది భారతదేశ మ్యూజియంలను అభివృద్ధి చేయడానికి ఉత్తమ పద్ధతులు మరియు వ్యూహాలపై దృష్టి పెడుతుంది

Posted On: 08 FEB 2022 2:45PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15-16, 2022న 'రీఇమేజింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా'పై తొలిసారిగా 2-రోజుల గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనుంది.

భారతదేశ స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రజలు, సంస్కృతి మరియు విజయాల యొక్క అద్భుతమైన చరిత్రను జరుపుకునే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అయిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించబడుతోంది.

ఈ ప్రపంచ సదస్సు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియం డెవలప్‌మెంట్ మరియు మేనేజ్‌మెంట్ రంగంలోని ప్రముఖ ప్రముఖులు, డొమైన్ నిపుణులు మరియు అభ్యాసకులను కలిసి ఉత్తమ పద్ధతులు మరియు వ్యూహాలను చర్చిస్తుంది. బ్లూమ్‌బెర్గ్ భాగస్వామ్యంతో ఈ సమ్మిట్ నిర్వహించబడుతోంది.

25 మందికి పైగా మ్యూజియాలజిస్టులు మరియు మ్యూజియం నిపుణులు మ్యూజియంల కోసం పునర్నిర్మించిన ప్రాధాన్యతలు మరియు అభ్యాసాలను పరిశీలిస్తారు. ఈ విజ్ఞాన భాగస్వామ్య ఫలితం కొత్త మ్యూజియంల అభివృద్ధికి బ్లూప్రింట్‌ను రూపొందించడం, పునరుద్ధరణ ఫ్రేమ్‌వర్క్‌ను పెంపొందించడం మరియు భారతదేశంలో ఇప్పటికే ఉన్న మ్యూజియంలను పునరుద్ధరించడం వంటివి కలిగి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సమ్మిట్‌ను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు.  సమ్మిట్ గురించి ఆయన మాట్లాడుతూ “మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న భూమి. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న నేపథ్యంలో మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, రక్షించడం మరియు శాశ్వతంగా కొనసాగించడం పట్ల దృష్టిని మరియు అంకితభావాన్ని పునరుద్ధరించడానికి మేము గర్విస్తున్నాము. భారతదేశం యొక్క  1000కి పైగా మ్యూజియంలు ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం మరియు సంరక్షించడంలో మాత్రమే కాకుండా, భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ మాట్లాడుతూ “భారతదేశంలో మ్యూజియంలను పునర్నిర్మించడంపై గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారతదేశ మ్యూజియంలను అభివృద్ధి చేయడానికి, భారతదేశం మరియు గ్లోబల్ మ్యూజియంల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచడానికి ఉత్తమమైన విధానాన్ని అర్థం చేసుకోవడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కీలక ప్రపంచ ఆలోచనా నాయకులను సమావేశపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భారతీయ మ్యూజియంలను నిజంగా ప్రపంచ స్థాయికి తీసుకురావడానికి వాటి పునరుద్ధరణ కోసం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించండం కూడా దీని లక్ష్యం.

ఈ ఆన్‌లైన్ సమ్మిట్ నాలుగు విస్తృత థీమ్‌లను కలిగి ఉంటుంది: అవి ఆర్కిటెక్చర్ మరియు ఫంక్షనల్ నీడ్స్; నిర్వహణ; సేకరణలు (క్యూరేషన్ & పరిరక్షణ పద్ధతులతో సహా); మరియు విద్య,  ప్రేక్షకుల భాగస్వామ్యం.

సమ్మిట్ రెండు రోజుల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది మరియు ప్రజలు ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం కోసం ఇక్కడ సైన్ అప్ చేయండి : https://www.reimaginingmuseumsinindia.com/

మరిన్ని వివరాల కోసం దయచేసి #MuseumsReimagined అనే హ్యాష్‌ట్యాగ్‌ని అనుసరించండి.


 

*****



(Release ID: 1796676) Visitor Counter : 204