ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

168.98 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 47 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 95.64%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,27,952

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 13,31,648

వారపు పాజిటివిటీ రేటు 11.21%

Posted On: 05 FEB 2022 9:25AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 47 లక్షలకు పైగా ( 47,53,081 ) డోసులతో కలిపి, 168.98 కోట్ల ( 1,68,98,17,199 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,87,05,424 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,97,320

రెండో డోసు

98,95,501

ముందు జాగ్రత్త డోసు

36,09,410

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,00,586

రెండో డోసు

1,73,03,841

ముందు జాగ్రత్త డోసు

45,95,770

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,88,44,872

రెండో డోసు

45,80,539

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,40,58,916

రెండో డోసు

41,40,88,065

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,08,49,691

రెండో డోసు

17,35,80,375

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,52,77,682

రెండో డోసు

10,81,41,859

ముందు జాగ్రత్త డోసు

61,92,772

ముందు జాగ్రత్త డోసులు

1,43,97,952

మొత్తం డోసులు

1,68,98,17,199

 

 

గత 24 గంటల్లో 2,30,814 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,02,47,902 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 95.64 శాతానికి చేరింది.

 

 

గత 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 13,31,648. ఇది మొత్తం కేసుల్లో 3.16 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 16,03,856 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73.79 కోట్లకు పైగా ( 73,79,32,233 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 11.21 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1795739) Visitor Counter : 103