ఆర్థిక మంత్రిత్వ శాఖ

గత రెండు సంవత్సరాలతో పోల్చితే 2021 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ద్రవ్య లోటు చాలా తక్కువ నమోదైంది


–ఏప్రిల్ నుండి నవంబర్ 2021 వరకు పన్ను, పన్నుయేతర ఆదాయాలు రెండింటిలోనూ బలమైన వృద్ధి కనిపించింది.

–ఏప్రిల్ నుండి నవంబర్ 2021 వరకు ప్రభుత్వం మొత్తం వ్యయంలో పునర్నిర్మాణం, ప్రాధాన్యత పెంపుదల ఉంది.

–2021–-22 మొదటి మూడు త్రైమాసికాలలో 13.5 శాతం పెరిగిన మూలధన వ్యయం

–ప్రైవేటీకరణ, డిజిన్వెస్ట్‌మెంట్‌ను పెంచడానికి కొత్త పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ పాలసీ అసెట్ మానిటైజేషన్ స్ట్రాటజీ అమలు

Posted On: 31 JAN 2022 2:56PM by PIB Hyderabad

"కరోనా పెరుగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం  చురుకైన విధాన ప్రతిస్పందనతో ముందుకు వెళ్లోంది. 2020లో ఇతర దేశాలు ఆమోదించిన  ఉద్దీపన ప్యాకేజీలను ప్రవేశపెట్టే జలపాత వ్యూహానికి భిన్నంగా ఉంది" అని యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ సమర్పించిన ఆర్థిక సర్వే 2021-–22 పేర్కొంది. కేంద్ర ఆర్థిక,  కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మహమ్మారి  ప్రారంభ దశలో, సమాజంలోని పేద  బలహీన వర్గాలను ఆపదల నుండి రక్షణ కల్పించడానికి భద్రతా-వలలను నిర్మించడంపై ఆర్థిక విధానం దృష్టి పెట్టిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణతో, ఆర్థిక ప్రతిస్పందనతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను ప్రేరేపించడంపై దృష్టి సారించింది. 2020–-21 మూడో త్రైమాసికంలో ఆరోగ్య సంబంధిత పరిమితుల సడలింపుతో మూలధన వ్యయం పెరిగింది. ఆర్థిక వ్యవస్థపై అత్యంత సానుకూల ప్రభావం ఉన్న రంగాలలో వ్యయాన్ని ప్రోత్సహించడం కోసం పలు చర్యలను తీసుకోవడం జరిగింది. ఆర్థిక సర్వే 2021–-22లోని ముఖ్యమైన పరిశీలనలు క్రింది విధంగా ఉన్నాయి:

 

ద్రవ్య లోటు

 

కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (కాగ్) ఏప్రిల్ నుండి నవంబర్ 2021 వరకు విడుదల చేసిన నివేదిక ప్రకారం... నవంబర్ 2021 చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు బీఈలో 46.2 శాతంగా ఉంది.  2020–-21,  2019–-20లో ఇదే కాలంలో వరుసగా 135.1 శాతంగా, 114.8 శాతం ఉంది. ఈ కాలంలో ద్రవ్య లోటు,  ప్రాథమిక లోటు రెండూ గత రెండేళ్లలో సంబంధిత స్థాయిల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఏప్రిల్ నుండి నవంబర్ 2021 మధ్య కాలంలో ప్రాథమిక లోటు ఏప్రిల్ నుండి నవంబర్ 2019 వరకు చేరిన స్థాయిలో దాదాపు సగానికి చేరుకుంది. ప్రస్తుత సంవత్సరంలో బడ్జెట్ లోటు, బడ్జెట్ చాలా వాస్తవికంగా ఉంది, ఎందుకంటే ఇది అనేక  -ఆఫ్–బడ్జెట్ అంశాలను తీసుకువచ్చింది. ఎఫ్సీఐ  ఆహార సబ్సిడీ అవసరాలు వంటి బడ్జెట్ కేటాయింపు వంటివి ఇందులో ముఖ్యమైనవి.

 

ఆదాయ సేకరణ

గత రెండు సంవత్సరాల్లోని సంబంధిత కాలాలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుండి నవంబర్ 2021 వరకు) రాబడి వసూళ్లు చాలా   వేగంతో పెరిగాయి. పన్ను,  పన్నుయేతర ఆదాయం రెండింటిలోనూ గణనీయమైన వృద్ధి ఈ పనితీరు కారణమని చెప్పవచ్చు. 2020-–21 పీఏకి సంబంధించి 2021–-22 బీఈలో 8.5 శాతం వృద్ధి చెందింది. కేంద్రానికి నికర పన్ను రాబడి 2020 ఏప్రిల్ నుండి నవంబర్ 2021 వరకు, ఏప్రిల్ నుండి నవంబర్ వరకు 64.9 శాతం  ఏప్రిల్‌ నుంచి నవంబరు 19 వరకు 51.2 శాతం పెరిగింది..

 

 

 

ప్రత్యక్ష పన్నులు

 

ప్రత్యక్ష పన్నుల పరిధిలో, వ్యక్తిగత ఆదాయపు పన్ను ఏప్రిల్-–నవంబర్ 2020లో 47.2 శాతం కాగా  ఏప్రిల్–-నవంబర్ 2019 కంటే 29.2 శాతం పెరిగింది. కార్పొరేట్ ఆదాయపు పన్ను ఏప్రిల్–-నవంబర్ 2020లో 90.4 శాతం పెరిగింది. ఏప్రిల్-–నవంబర్ 2019లో   22.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 

పరోక్ష పన్నులు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో పరోక్ష పన్ను వసూళ్లు 38.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్ నుండి నవంబర్ 2021 వరకు కస్టమ్స్ నుండి వచ్చే ఆదాయ సేకరణ ఏప్రిల్ నుండి నవంబర్ 2020 కంటే దాదాపు 100 శాతం  ఏప్రిల్ నుండి నవంబర్ 2019తో పోల్చితే 65 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్-–నవంబర్ 2021 మధ్యకాలంలో ఎక్సైజ్ సుంకాల నుండి వచ్చే ఆదాయం సంవత్సరానికి 23.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేంద్రానికి జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నుండి నవంబర్ 2021 మధ్య కాలంలో బీఈలో 61.4 శాతంగా ఉన్నాయి. స్థూల జీఎస్టీ వసూళ్లు, కేంద్రం  రాష్ట్రాలు కలిపి, ఏప్రిల్ నుండి డిసెంబర్ 2021 మధ్య కాలంలో రూ.10.74 లక్షల కోట్లు ఉన్నాయి. 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఇది 61.5 శాతం,  ఏప్రిల్ నుండి డిసెంబర్ 2019 వరకు 33.7 శాతం పెరిగాయి.

 

పన్నేతర ఆదాయం

నవంబర్ 2021 వరకు పన్నుయేతర రాబడి వసూళ్లు 79.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ పెరుగుదల డివిడెండ్‌లు,  లాభాల ద్వారా సాధ్యమయింది. ఇది బీఈ  రూ.1.04 లక్షల కోట్లతో పోలిస్తే 1.28 లక్షల కోట్లు ఎక్కువ. ఈ కాలంలో డివిడెండ్‌లు  లాభాల్లో కీలకమైన భాగం ఆర్‌బిఐ నుండి కేంద్ర ప్రభుత్వానికి రూ. 0.99 లక్షల కోట్ల మిగులు బదిలీ అయింది.

 

వ్యయం

 

ఏప్రిల్ నుండి నవంబర్ 2021 మధ్య కాలంలో ప్రభుత్వ మొత్తం వ్యయం 8.8 శాతం పెరిగింది  బడ్జెట్ అంచనాలో ఇది 59.6 శాతంగా ఉంది. 2020-–21లో ఇదే కాలంలో రెవెన్యూ వ్యయం 2021–-22 మొదటి ఎనిమిది నెలల్లో 8.2 శాతం వృద్ధి చెందగా, వడ్డీయేతర రాబడి వ్యయం 2020 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 4.6 శాతం పెరిగింది.

 

మూలధన వ్యయం

 

2021 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు, రోడ్లు  హైవేలు, రైల్వేలు  హౌసింగ్  అర్బన్ అఫైర్స్ వంటి అవస్థాపన సెక్టార్లలో దృష్టి పెట్టడంతో మూలధన వ్యయం 13.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ పెరుగుదల ముఖ్యంగా గత సంవత్సరం  సంబంధిత కాలంలో నమోదు చేసిన మూలధన వ్యయంలో అధిక వార్షిక ప్రాతిపదికన వృద్ధిని బట్టి గణనీయంగా ఉంది.  రాష్ట్రాల మూలధన వ్యయాన్ని పెంచడానికి కేంద్రం అనేక ప్రోత్సాహకాలను కూడా అందజేసింది.

 

కొత్త పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ పాలసీ , ఆస్తుల అమ్మకం వ్యూహం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ పాలసీ  అసెట్ మానిటైజేషన్ స్ట్రాటజీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ  వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం అమలు చేస్తారు. ఎయిర్ ఇండియా  ప్రైవేటీకరణ ప్రత్యేకించి ముఖ్యమైనది, పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయాన్ని పొందడం పరంగా మాత్రమే కాకుండా ప్రైవేటీకరణ డ్రైవ్‌ను పెంచడంలోనూ ఇది కీలకం.

 

 

 

 

ఆర్థిక పరమైన ముఖ్యాంశాలు

ఏప్రిల్–-నవంబర్ 2021 (వార్షిక ప్రాతిపదికన) మధ్యకాలంలో

రెవెన్యూ రాబడులు 67.2శాతం పెరిగాయి

స్థూల పన్ను ఆదాయం 50శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది

మూలధన వ్యయం 13.5శాతం పెరిగింది

ఆర్థిక లోటు బీఈలో 46.2శాతం వద్ద ఉంది

ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో ప్రభుత్వ రుణాలు తగ్గుముఖం పడతాయని అంచనా

బడ్జెట్ కేటాయింపులలో అనేక ఆఫ్-బడ్జెట్ అంశాలను తీసుకువచ్చారు

కేంద్ర ప్రభుత్వ క్యాపెక్స్ 67శాతం పెరిగింది

 

***



(Release ID: 1794247) Visitor Counter : 247