ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
160.43 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం
గత 24 గంటల్లో 70 లక్షలకుపైగా డోసులు నిర్వహణ
ప్రస్తుత రికవరీ రేటు 93.50%
గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,47,254
ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసులు 9,692. నిన్నటి కంటే 4.36% వృద్ధి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,18,825
వారపు పాజిటివిటీ రేటు 16.56%
Posted On:
21 JAN 2022 9:33AM by PIB Hyderabad
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 70 లక్షలకు పైగా ( 70,49,779 ) డోసులతో కలిపి, 160.43 కోట్ల ( 1,60,43,70,484 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,72,80,628 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
మొత్తం టీకా డోసులు
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
1,03,91,052
|
రెండో డోసు
|
98,02,401
|
ముందు జాగ్రత్త డోసు
|
24,43,673
|
ఫ్రంట్లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
1,83,89,891
|
రెండో డోసు
|
1,71,04,055
|
ముందు జాగ్రత్త డోసు
|
22,78,810
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
3,96,06,464
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
53,13,79,742
|
రెండో డోసు
|
38,12,54,261
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
19,85,98,912
|
రెండో డోసు
|
16,44,76,409
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
12,37,54,315
|
రెండో డోసు
|
10,27,51,056
|
ముందు జాగ్రత్త డోసు
|
21,39,443
|
ముందు జాగ్రత్త డోసులు
|
68,61,926
|
మొత్తం డోసులు
|
1,60,43,70,484
|
గత 24 గంటల్లో 2,51,777 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,60,58,806 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 93.50 శాతానికి చేరింది.
గత 24 గంటల్లో 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,18,825. ఇది మొత్తం కేసుల్లో 5.23 శాతం.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 19,35,912 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 71.15 కోట్లకు పైగా ( 71,15,38,938 ) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 16.56 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా నమోదైంది.
****
(Release ID: 1791391)
Visitor Counter : 164