ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రవాస భారతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రవాసులకు ప్ర‌ధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 09 JAN 2022 9:52AM by PIB Hyderabad

   ప్రవాస భార‌తీయ దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌తి ఒక్క‌రికీ..  ముఖ్యంగా.. ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“ప్రవాస భారతీయ దినోత్సవం నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ… ప్రత్యేకించి ప్రవాస భారతీయులకు నా శుభాకాంక్షలు. మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అదే సమయంలో వారు తమ మూలాలతో మమేకమై ఉండటం విశేషం. మనమంతా గర్వపడేలా వారెన్నో విజయాలు సాధిస్తుండటం హర్షణీయం” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1788725) సందర్శకుల సూచీ సంఖ్య : : 249