ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

144.54 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 66 లక్షలకు పైగా డోసులు నిర్వహణ

98.36 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 16,764 కొత్త కేసులు నమోదు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 91,361

వారపు పాజిటివిటీ రేటు ( 0.89 శాతం ) గత 47 రోజులుగా 1 శాతం కంటే తక్కువ

Posted On: 31 DEC 2021 9:51AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 66,65,290 డోసులతో కలిపి, 144.54 కోట్ల డోసులను ( 1,44,54,16,714 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,54,27,550 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,87,564

రెండో డోసు

97,08,297

 

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,85,606

రెండో డోసు

1,68,89,042

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

49,88,95,079

రెండో డోసు

33,05,31,530

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,43,82,386

రెండో డోసు

15,00,28,450

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,13,19,090

రెండో డోసు

9,48,89,670

మొత్తం

1,44,54,16,714

 

గత 24 గంటల్లో 7,585 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,42,66,363 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.36 శాతానికి చేరింది.

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 186వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 16,764 కొత్త కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 91,361. మొత్తం కేసుల్లో పాజిటివ్ కేసులు 0.26 శాతం.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 12,50,837 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 67.78 కోట్లకు పైగా ( 67,78,78,255 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.89 శాతంగా ఉంది. గత 47 రోజులుగా 1 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.34 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 88 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 123 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

 

****


(Release ID: 1786573) Visitor Counter : 128