ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్  టీకామందు రెండో డోజు ను ఇప్పించడం లో అగ్రస్థానాన్ని సంపాదించినందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ని అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 06 DEC 2021 2:18PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ లో లక్ష్యం మేరకు కోవిడ్ టీకామందు రెండో డోజు ను అర్హులైన పౌరుల కు ఇప్పించడం ద్వారా దేశం లో అగ్ర స్థానాన్ని సంపాదించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కి అభినందనలను తెలియజేశారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్ ట్వీట్ కు సమాధానంగా ప్రధాన మంత్రి -

‘‘చాలా చాలా శుభాకాంక్షలు @jairamthakurbjp గారు. కోవిడ్ కు వ్యతిరేకం గా పోరాడడం లో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఒక అనుకరించదగినటువంటి ఉదాహరణ ను యావత్తు దేశం ఎదుట నిలిపారు. ప్రజల లోని ఈ ఉద్వేగం ఈ యొక్క పోరాటం లో న్యూ ఇండియా కు కొత్త బలాన్ని ఇస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH

 



(Release ID: 1778458) Visitor Counter : 142