ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
127.93 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం
గత 24 గంటల్లో 24 లక్షలకు పైగా డోసులు నిర్వహణ
98.35 శాతానికి చేరిన రికవరీ రేటు
గత 24 గంటల్లో 8,306 కొత్త కేసులు నమోదు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 98,416; ఇది 552 రోజుల కనిష్ట స్థాయి
వారపు పాజిటివిటీ రేటు ( 0.78 శాతం ) గత 22 రోజులుగా 1 శాతం కంటే తక్కువ
Posted On:
06 DEC 2021 9:48AM by PIB Hyderabad
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 24,55,911 డోసులతో కలిపి, 127.93 కోట్ల డోసులను ( 1,27,93,09,669 ) టీకా కార్యక్రమం అధిగమించింది. 1,32,86,429 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
1,03,84,617
|
రెండో డోసు
|
95,48,009
|
ఫ్రంట్లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
1,83,81,233
|
రెండో డోసు
|
1,65,92,175
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
46,75,22,029
|
రెండో డోసు
|
24,44,87,121
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
18,69,15,771
|
రెండో డోసు
|
12,62,94,812
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
11,69,97,622
|
రెండో డోసు
|
8,21,86,280
|
మొత్తం
|
1,27,93,09,669
|
గత 24 గంటల్లో 8,834 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,40,69,608 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 98.35 శాతానికి చేరింది.
కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 162వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 8,306 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 98,416. పాజిటివ్ కేసుల శాతం కూడా (0.29) 2020 మార్చి నుంచి కనిష్ట స్థాయి.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 8,86,263 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 64.82 కోట్లకు పైగా ( 64,82,59,067 ) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 0.78 శాతంగా ఉంది. గత 22 రోజులుగా 1 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.94 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 63 రోజులుగా 2 శాతం కంటే తక్కువగా, 98 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది.
****
(Release ID: 1778370)
Visitor Counter : 168