ఆర్థిక మంత్రిత్వ శాఖ

2021 నవంబర్ లో 1,31,526 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు


గత నెలకు మించి నవంబర్ లో జీఎస్టీ చెల్లింపు

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత రెండోసారి అత్యధికంగా వసూళ్లు

గత ఏడాది నవంబర్ తో పోల్చి చూస్తే ఈ ఏడాది నవంబర్ లో 25%, 2019-20 నవంబర్ కంటే 27% పెరిగిన జీఎస్టీ ఆదాయం

Posted On: 01 DEC 2021 12:14PM by PIB Hyderabad

దేశంలో 2021 నవంబర్ నెలలో 1,31,526 కోట్ల రూపాయల విలువ చేసే జీఎస్టీ వసూలు అయ్యింది. దీనిలో సి జీఎస్టీ 23,978 కోట్ల రూపాయలుగా, ఎస్ జీఎస్టీ 31,127 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ 66, 815 కోట్ల రూపాయలు ( దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన 32,165 కోట్ల రూపాయలను కలుపుకుని), సెస్ గా 9,606 కోట్ల రూపాయలు (వస్తువుల దిగుమతిపై సేకరించిన 653 కోట్ల రూపాయలతో సహా) ఉన్నాయి.
ఐజీఎస్టీ ఆదాయంలో సి జీఎస్టీ కి 27,273 కోట్ల రూపాయలను, ఎస్ జీఎస్టీ కి 22,655 కోట్ల రూపాయలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది. సాధారణ సర్దుబాట్లు పూర్తయిన తరువాత 2021 నవంబర్ నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లభించిన ఆదాయం 51,251 కోట్ల రూపాయలు (సి జీఎస్టీ), 53,782 కోట్ల రూపాయలు (ఎస్ జీఎస్టీ) గా ఉంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం 03.11.202117,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

దేశంలో వరుసగా రెండో నెలలో జీఎస్టీ వసూళ్లు 1.30 లక్షలకు మించి జరిగాయి. గత ఏడాది నవంబర్ తో పోల్చి చూస్తే దేశంలో 2021 నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 25%, 2019-20 నవంబర్ తో పోల్చి చూస్తే 27% మేరకు పెరిగాయి. ఈ నెలలో దేశంలో జరిగిన లావాదేవీలు ( సేవల దిగుమతితో కలుపుకుని)కంటే దిగుమతి చేసుకున్న వస్తువులపై 43% ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ఏడాది నవంబర్ తో పోల్చి చూస్తే ఈ వృద్ధి 20% వరకు ఉంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత 2021 నవంబర్ నెలలో రెండోసారి అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి. 2021 ఏప్రిల్ లో అత్యధిక జీఎస్టీ వసూళ్లు జరిగాయి. సంవత్సరాంతపు రాబడులకు సంబంధించిన ఈ వసూళ్లు గత నెల వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మూడు నెలలకు ఒకసారి రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అంశం ప్రభావం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు సాగుతున్నాయి.

పన్ను చెల్లింపుల అంశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిపాలనా పరమైన చర్యల వల్ల జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర సంస్థల సహకారంతో కేంద్ర కేంద్ర పన్ను అమలు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ పన్ను ఎగవేతదారులను గుర్తిస్తున్నాయి. జీఎస్టీఎన్ అభివృద్ధి చేసిన వివిధ ఐటీ పరికరాలు ఉపయోగిస్తూ సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. నకిలీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగిస్తూ పన్ను చెల్లించకుండా వ్యాపారులు తప్పించుకుంటున్నారని గుర్తించడం జరిగింది. దీనిని అరికట్టడానికి రిటర్న్, ఇన్‌వాయిస్ మరియు ఇ-వే బిల్లు సమాచారాన్ని విశ్లేషిస్తూ అనుమానాస్పద పన్ను చెల్లింపుదారులను గుర్తించడం జరుగుతోంది.

వ్యవస్థ సామర్ధ్యాన్ని మెరుగు పరచడానికి, గడువు ముగిసినా రిటర్న్ దాఖలు చేయని వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం, , ఇ-వే బిల్లులను నిరోధించడం మరియు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఆమోదించడం వంటి చర్యలను గత ఏడాది ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వం మేలు చేస్తున్న చర్యల వల్ల గత కొద్ది నెలలుగా ఎక్కువ మంది రిటర్న్‌లను దాఖలు చేస్తున్నారు.

ఈ కింది చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెల వారీగా స్థూల జీఎస్టీ ఆదాయాన్ని తెలియజేస్తుంది. 2021, 2020 నవంబర్ నెలలో రాష్ట్రాల వారీ గణాంకాల వివరాలను పట్టికలో పొందుపర్చడం జరిగింది.

 

https://ci3.googleusercontent.com/proxy/2bpKz5sbCJFzVuFjpucKa7_kqU80fsFE7kFt9_IKIEwl6OMdG4YHdFBMHnw4DrXf4gQkr06hNCogwxu2kZRYiqzZvSk5SiqeiGHWu1Pecd7MyoFBKq20jzQbYQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001699U.png
 

 

నవంబర్ 2021లో రాష్ట్రాల వారీగా GST రాబడి వృద్ధి [1]

 

రాష్ట్రం

నవంబర్-20

నవంబర్-21

వృద్ధి

జమ్మూ కాశ్మీర్

360

383

6%

హిమాచల్ ప్రదేశ్

758

762

0%

పంజాబ్

1,396

1,845

32%

చండీగఢ్

141

180

27%

ఉత్తరాఖండ్

1,286

1,263

-2%

హర్యానా

5,928

6,016

1%

ఢిల్లీ

3,413

4,387

29%

రాజస్థాన్

3,130

3,698

18%

ఉత్తర ప్రదేశ్

5,528

6,636

20%

బీహార్

970

1,030

6%

సిక్కిం

223

207

-7%

అరుణాచల్ ప్రదేశ్

60

40

-33%

నాగాలాండ్

30

30

2%

మణిపూర్

32

35

11%

మిజోరం

17

23

37%

త్రిపుర

58

58

-1%

మేఘాలయ

120

152

27%

అస్సాం

946

992

5%

పశ్చిమ బెంగాల్

3,747

4,083

9%

జార్ఖండ్

1,907

2,337

23%

ఒడిషా

2,528

4,136

64%

ఛత్తీస్‌గఢ్

2,181

2,454

13%

మధ్యప్రదేశ్

2,493

2,808

13%

గుజరాత్

7,566

9,569

26%

డామన్ మరియు డయ్యూ

2

0

-94%

దాద్రా మరియు నగర్ హవేలీ

296

270

-9%

మహారాష్ట్ర

15,001

18,656

24%

కర్ణాటక

6,915

9,048

31%

గోవా

300

518

73%

లక్షద్వీప్

0

2

369%

కేరళ

1,568

2,129

36%

తమిళనాడు

7,084

7,795

10%

పుదుచ్చేరి

158

172

9%

అండమాన్ మరియు నికోబార్ దీవులు

23

24

5%

తెలంగాణ

3,175

3,931

24%

ఆంధ్రప్రదేశ్

2,507

2,750

10%

లడఖ్

9

13

46%

ఇతర భూభాగం

79

95

20%

కేంద్రం పరిధి

138

180

30%

మొత్తము

82,075

98,708

20%

 

 

 

 



(Release ID: 1776885) Visitor Counter : 355